భద్రాచలం టౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరిగింది. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 34.8 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం(Water level) క్రమక్రమంగా పెరుగుతూ శనివారం ఉదయం 6 గంటలకు చేరుకుంది. ఉదయం 8 గంటలకు 41.6 అడుగులు, 9 గంటలకు 42 అడుగులు, 10 గంటలకు 42.30 అడుగులు, 11 గంటలకు 42.5 అడుగులు, 12 గంటలకు 43 అడుగులకు చేరుకోగా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు 43.27 అడుగులు, 2 గంటలకు 43.50 అడుగులు మూడు గంటలకు 43.90 డుగులు, నాలుగు గంటలకు 44. 20 అడుగులు ఐదు గంటలకు 44.50 అడుగులు, 6 గంటలకు 44.70 అడుగులు ఎనిమిది గంటలకు 45.10 అడుగులు ఎత్తులో 10,18,806 క్యూసెక్కుల వరద నీరు దిగువ ప్రాంతానికి పయనం అవుతుంది.
Read Also : Asifabad District: ఎలుగుబంటి దాడిలో దంపతులు మృతి

కాగా నేడు ఉదయం 47 అడుగుల చేరువలో గోదావరి ప్రవాహం ఉండనుందని సంబంధిత అధికారులు అంచనాకు వస్తున్నారు. ఆ తర్వాత మరో రెండు అడుగులు తగ్గి మరల అదే స్థాయికి పెరగనుందని తెలుపుతున్నారు. ఈ వారం రోజులు కూడా గోదావరి ఇదే స్థాయిలో ప్రవహించనుందని వెల్లడిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షి స్తున్నదని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొ న్నారు. అప్రమత్తమైన(Alert) అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల జాబితాను సిద్ధం చేయగా ७గ్రామాలను తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు విస్తృతంగా పర్యటించి ఆ గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి ఎప్పుడు వరదలు ముంచుకొచ్చినా అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లవద్దన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: