తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగైన సంక్రాంతి సందడి మొదలవడంతో, ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ఛార్జీల దోపిడీకి తెరలేపాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుండి విజయవాడ వంటి నగరాలకు బస్సు ఛార్జీ సుమారు రూ. 700 నుండి రూ. 800 వరకు ఉంటుంది. అయితే, పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఏజెన్సీలు ఏకంగా రూ. 2,700 నుండి రూ. 4,000 వరకు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే సాధారణ ధర కంటే దాదాపు 4 నుండి 5 రెట్లు అధికంగా వసూలు చేస్తూ సామాన్య ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రైళ్లలో నెలల ముందే రిజర్వేషన్లు పూర్తయిపోవడంతో, ప్రయాణికులకు ప్రైవేటు బస్సులే ప్రత్యామ్నాయంగా మారాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నప్పటికీ, పెరుగుతున్న రద్దీకి అవి సరిపోవడం లేదు. సొంత ఊళ్లకు వెళ్లాలనే ఆరాటంలో ఉన్న ప్రజలు, రైలు టిక్కెట్లు దొరకక అనివార్యంగా ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదనుగా తీసుకుంటున్న ట్రావెల్స్ యజమానులు, సీటు రకాన్ని బట్టి (స్లీపర్, సెమీ స్లీపర్, ఏసీ) డిమాండ్ను బట్టి ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు.

ఈ పరిణామాలపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు (TGSRTC & APSRTC) అదనపు బస్సులను నడుపుతున్నా, ప్రైవేటు ఆపరేటర్ల అక్రమ వసూళ్లను అరికట్టడంలో రవాణా శాఖ విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, అధిక ధరలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయాలని మరియు భారీ జరిమానాలు విధించాలని బాధితులు కోరుతున్నారు. పండుగ సంతోషం కంటే ప్రయాణ ఖర్చుల భారమే ఎక్కువగా ఉందని మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com