हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Swecha Votarkar : ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య

Sudheer
Swecha Votarkar : ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య

హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (Swetcha Votarkar ) (40) చిక్కడపల్లిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి 10:30 గంటల సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

విడాకులు, వ్యక్తిగత విభేదాల మధ్య తీవ్ర నిర్ణయం

స్వేచ్ఛ గతంలో తన భర్త నుంచి విడాకులు తీసుకుని, కుమార్తె మరియు స్నేహితుడితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ స్నేహితుడితో వ్యక్తిగత విభేదాలు రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఆమె తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజమైన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు స్నేహితుడిని విచారించనున్నారు.

జర్నలిస్టు వర్గాల్లో విషాదం

స్వేచ్ఛ వోటార్కర్ జర్నలిజం రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఈసీ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె భవిష్యత్తుపై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో సేవలందించారు. స్వేచ్ఛ అకస్మాత్తుగా మరణించడంతో జర్నలిస్టు సంఘాలు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Read Also : Indiramma Atmiya Bharosa Scheme : వచ్చే వారంలో ఖాతాల్లోకి రూ.6వేలు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870