हिन्दी | Epaper

గన్నవరంలో విమాన రాకపోకలకు అంతరాయం..

sumalatha chinthakayala
గన్నవరంలో విమాన రాకపోకలకు అంతరాయం..

అమరావతి : గన్నవరం ఎయిర్‌పోర్టును పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచుతో ఢిల్లీ నుంచి వచ్చి ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ల్యాండింగ్ ఇబ్బంది తలెత్తడంతో గాలిలోనే విమానం చక్కర్లు కొడుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలముకుంది. పొగమంచు కారణంగా రహదారులపై పొగమంచు కమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది.

దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలు మార్లు చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదని వాతావరణం అనుకూలించిన వెంటనే క్లియరెన్స్ ఇస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి వచ్చిన విమానానికి ల్యాండింగ్ అయ్యేందుకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది.

గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగాల్సిన ఇండిగో విమానం గాల్లోనే చక్కర్లు కొడుతున్న వార్త తెలిసి ప్రయాణికుల బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా పార్క్ లైట్లు వేసుకుని వస్తే గానీ ముందర వచ్చే వాహనాలు కనబడే పరిస్థితి నెలకొంది. దగ్గరకు వచ్చే వరకు కూడా వాహనాలు ఏంటి అనేది తెలియక వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాహనాలను జాగ్రత్తగా, అతి నెమ్మదిగా నడుపుతూ ముందుకు వెళ్తున్నారు వాహనదారులు. పొరపాటున ఎదురు వాహనాలను కనబడకపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

📢 For Advertisement Booking: 98481 12870