పశ్చిమ ఆసియాలో (West Asia) ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా జరుపుతున్న దాడుల కారణంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా, గల్ఫ్ దేశాల్లోని పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. మార్చి 11 వరకు జరగాల్సిన అన్ని 10వ తరగతి పరీక్షలు రద్దయ్యాయని, వీరికి ఫలితాలను ఏ ప్రాతిపదికన ప్రకటిస్తామనేది త్వరలోనే వెల్లడిస్తామని బోర్డు స్పష్టం చేసింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ వంటి దేశాల్లోని వేలాది మంది భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also : Nagarkurnool crime: గిరిజన బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం
మరోవైపు, మార్చి 7 నుంచి ప్రారంభం కావాల్సిన 12వ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ సైతం ప్రతికారం తీర్చుకుంటామని ప్రకటించి, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులను తీవ్రతరం చేసింది. ఈ యుద్ధ వాతావరణంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ప్రాణాపాయంతో కూడుకున్న పని కావడంతో, భారత దౌత్య వర్గాలతో సంప్రదించిన అనంతరం బోర్డు ఈ అత్యవసర నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాతే తదుపరి షెడ్యూల్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :