हिन्दी | Epaper
పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Chandrababu’s Rule : చంద్రబాబు పాలన అద్భుతం

Sudheer
Chandrababu’s Rule : చంద్రబాబు పాలన అద్భుతం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (CM Chandrababu) పరిపాలన అద్భుతమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ్ (Venkate Gowda Gopala Gowda) ప్రశంసించారు. చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన అన్నమయ్య జిల్లా చీకలబైలులో జరుగుతున్న గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయి

ఈ సందర్భంగా అమరావతి రాజధాని గురించి జస్టిస్ గోపాలగౌడ్ ప్రస్తావించారు. రాజధానిగా అమరావతికి తాను గతంలోనే మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయడం అభినందనీయమని అన్నారు. రైతులకు న్యాయం జరుగుతుండటం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.

వైసీపీ పై విమర్శలు

తదుపరి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కూడా ఆయన స్పందించారు. అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై సమగ్ర విచారణ జరిపి, తప్పు నిరూపితమైతే కఠిన శిక్షలు విధించాలన్నారు. అధికారం చేతిలో ఉందని అన్యాయాలు చేసే వారికి చట్టపరంగా తగిన శిక్షలు పడినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్నారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో అధికారుల నిర్వాహనంలో నైతిక బాధ్యతను పెంచుతాయని జస్టిస్ గోపాలగౌడ్ స్పష్టం చేశారు.

Read Also : TPCC : వారం రోజుల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870