Chandrababu Naidu : తొలిసారిగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో, దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు–పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఘనంగా పుష్కరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లు నిర్మించాలన్న ప్రణాళికను అధికారులు వివరించారు.
Read Also: Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!
పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు. భక్తులకు (Chandrababu Naidu) సురక్షితమైన స్నానాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా, భద్రత అన్నింటినీ సమన్వయంతో అమలు చేయాలని చెప్పారు. తన పాలనలో మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం గర్వకారణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: