Youtuber wedding viral : ప్రస్తుతం సోషల్ మీడియాలో వరకట్నం అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రముఖ యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లిలో భారీ మొత్తంలో నగదు, బంగారం తీసుకున్నాడనే ఆరోపణలు వైరల్ కావడంతో నెట్టింట కలకలం రేగింది. కట్నంగా రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం అందుకున్నట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ, ‘గిఫ్ట్స్’ పేరుతో పెద్ద మొత్తాల్లో నగదు, నగలు ఇవ్వడం కొందరిలో కొనసాగుతూనే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. పన్వర్ పెళ్లిలో తీసుకున్న మొత్తం బహుమతులేనని అతని అనుచరులు చెబుతుండగా, ఇది కట్నమేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Rangareddy News: వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

ఈ వీడియోను సుమిత్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు సమాచారం. పన్వర్ యూట్యూబ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నప్పటికీ వధువు కుటుంబం నుంచి భారీ మొత్తం తీసుకోవడం సమంజసం కాదని ఆయన విమర్శించారు. వీడియోలో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు కనిపించడం చర్చకు దారితీసింది.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, వరకట్నం వంటి పాత సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. చట్టప్రకారం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో అధికారుల స్పందన ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epapervaartha.com
Read Also: