తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తాజాగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను (Ministries Allotment) కేటాయించారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, న్యాయ, క్రీడల శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు అప్పగించారు. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వీరికి కొత్త బాధ్యతలు అప్పగించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు చర్చనీయాంశమయ్యాయి.
హోం, మున్సిపల్, విద్య శాఖలు సీఎం వద్దే
ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్తో సుదీర్ఘ చర్చల అనంతరం హైదరాబాద్ చేరుకుని ముఖ్య కార్యదర్శితో సమావేశమయ్యారు. తాను ప్యాలెట్ చేస్తున్న హోం, మున్సిపల్, విద్య వంటి కీలక శాఖలను మాత్రం ఇతర మంత్రులకు కేటాయించలేదు. సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు హోంశాఖ కోసం హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసినప్పటికీ, ఆ బాధ్యతలను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. దీంతో సీనియర్ల ప్రయత్నాలు ఫలించలేదు.
మరో పవర్ సెంటర్కి అవకాశం లేకుండా సీఎం నిర్ణయాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హైకమాండ్ సూచనలు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో శాఖల కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన శాఖలను తానే నిర్వహిస్తూ, మరో పవర్ సెంటర్ ఏర్పడకూడదని గట్టి నిశ్చయంతో ఉన్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేబినెట్లో ఇంకా మూడు ఖాళీలుండగా, అవి భర్తీ అయిన తర్వాతే మిగతా కీలక శాఖలు ఇతరులకు అప్పగించే అవకాశముందని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులతో పాటు, కార్పొరేషన్లకు అధ్యక్షుల నియామకం కూడా త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also : Modi : మోదీ సర్కార్ జవాన్లను అవమానించింది – కాంగ్రెస్