తెలంగాణ రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులపై అవినీతి నిరోధక విభాగం (ACB) మరోసారి సడన్ దాడులు నిర్వహించింది. అర్ధరాత్రి నుంచే ఈ దాడులు ప్రారంభమై ఉదయం వరకు కొనసాగాయి. మహబూబ్నగర్ జిల్లా కృష్ణా చెక్పోస్ట్, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్పోస్ట్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెక్పోస్ట్, కామారెడ్డి జిల్లా కామారెడ్డి మరియు మద్నూరు చెక్పోస్టులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్పోస్టుల్లో అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. వాహనాలపై వసూలు జరుగుతున్న రుసుములు, అనధికార వసూళ్ల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సోదాల సమయంలో పలువురు అధికారులను, సిబ్బందిని ACB అధికారులు ప్రశ్నించారు.
Breaking News – Application for Liquor Stores : 68,900 అప్లికేషన్లు.. మరో 30 వేలు వచ్చే ఛాన్స్
రవాణాశాఖ చెక్పోస్టులపై ఈ సోదాలు అక్రమ వసూళ్లపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే జరిగాయి. కొంతమంది అధికారులు లారీ యజమానుల నుండి అనధికార వసూళ్లు చేస్తున్నారని, మోసపూరితంగా లావాదేవీలు నిర్వహిస్తున్నారని ACBకి సమాచారం అందిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో దాడులు జరపడం ద్వారా వ్యవస్థలో ఉన్న అవినీతి బహిర్గతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో కూడా ఇలాగే రాష్ట్రంలోని చెక్పోస్టులపై ACB ఒకేసారి దాడులు నిర్వహించగా, ఆ సమయంలో భారీగా అక్రమ రుసుములు, నగదు సీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటి దాడులతో రవాణాశాఖలో మళ్లీ కలకలం రేగింది. అధికారులు రాత్రిపూట సడన్గా దాడులు చేయడంతో సిబ్బంది తట్టుకోలేకపోయారని సమాచారం. రవాణాశాఖలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ దాడుల తర్వాత మరికొన్ని చెక్పోస్టుల్లో సస్పెన్షన్లు, బదిలీలు జరిగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ప్రజా నిధులను కాపాడటానికి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను పారదర్శకంగా ఉంచటానికి ACB చర్యలు అవసరమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/