हिन्दी | Epaper

Midhun Reddy : మిథున్ రెడ్డి అరెస్టుకు ఏసీబీ కోర్టు నిరాకరణ

Sudheer
Midhun Reddy : మిథున్ రెడ్డి అరెస్టుకు ఏసీబీ కోర్టు నిరాకరణ

ఆంధ్రప్రదేశ్‌లోని లిక్కర్ స్కాం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు (MP Midhun Reddy)కు అనుమతివ్వాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే, కోర్టు సిట్ పిటిషన్‌ను తిరస్కరించింది. పలు కారణాలను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మిథున్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది.

విచారణకు సహకరిస్తున్నారని కోర్టుకు సమాచారం

కేసు విచారణ సందర్భంగా కోర్టు, “ఎంపీ విచారణకు సహకరిస్తున్నారా?” అనే ప్రశ్నను సిట్ తరఫు లాయర్‌కు వేసింది. దీనికి సమాధానంగా “అవును, ఆయన సహకరిస్తున్నారు” అని లాయర్ పేర్కొనడంతో కోర్టు అరెస్ట్ అవసరం లేదని అభిప్రాయపడింది. సాంకేతిక కారణాలను కూడా పరిశీలించిన కోర్టు, అరెస్ట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇదే కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల వద్ద తిరస్కరించబడ్డాయి.

తాత్కాలిక ఊరట.. కానీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది


ఏసీబీ కోర్టు నిర్ణయంతో మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. SIT దర్యాప్తు కొనసాగిస్తూ, మరిన్ని ఆధారాలు సేకరించడానికి కృషి చేస్తోంది. లిక్కర్ స్కాంలో ఇతర నేతల పాత్ర కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ కేసు రాజకీయంగా మరింత సంచలనాత్మకంగా మారే అవకాశాలున్నాయి.

Read Also : Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870