ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కాం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు (MP Midhun Reddy)కు అనుమతివ్వాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే, కోర్టు సిట్ పిటిషన్ను తిరస్కరించింది. పలు కారణాలను ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మిథున్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది.
విచారణకు సహకరిస్తున్నారని కోర్టుకు సమాచారం
కేసు విచారణ సందర్భంగా కోర్టు, “ఎంపీ విచారణకు సహకరిస్తున్నారా?” అనే ప్రశ్నను సిట్ తరఫు లాయర్కు వేసింది. దీనికి సమాధానంగా “అవును, ఆయన సహకరిస్తున్నారు” అని లాయర్ పేర్కొనడంతో కోర్టు అరెస్ట్ అవసరం లేదని అభిప్రాయపడింది. సాంకేతిక కారణాలను కూడా పరిశీలించిన కోర్టు, అరెస్ట్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇదే కేసులో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుల వద్ద తిరస్కరించబడ్డాయి.
తాత్కాలిక ఊరట.. కానీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది
ఏసీబీ కోర్టు నిర్ణయంతో మిథున్ రెడ్డికి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. SIT దర్యాప్తు కొనసాగిస్తూ, మరిన్ని ఆధారాలు సేకరించడానికి కృషి చేస్తోంది. లిక్కర్ స్కాంలో ఇతర నేతల పాత్ర కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ కేసు రాజకీయంగా మరింత సంచలనాత్మకంగా మారే అవకాశాలున్నాయి.
Read Also : Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్