Ac price increase india : ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ధరల షాక్ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ Voltas ఈ ఏడాది ఏసీల ధరలు 5 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ముడిసరుకుల ఖర్చులు పెరగడం, రూపాయి బలహీనపడటం వంటి ఆర్థిక కారణాలు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముకుందన్ మేనన్ వెల్లడించారు.
ఏసీల తయారీలో కీలకమైన రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు గణనీయంగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని ఆయన తెలిపారు. గతంలో టన్నుకు సుమారు 8,500 డాలర్లుగా ఉన్న రాగి ధర ప్రస్తుతం 12,000–13,000 డాలర్ల వరకు చేరినట్లు వివరించారు. అదనంగా, కొన్ని కీలక విడిభాగాలను ఇంకా దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆ దిగుమతి ఖర్చులు కూడా వినియోగదారులపై పడుతున్నాయని పేర్కొన్నారు. కొత్త ఎనర్జీ ఎఫిషియెన్సీ లేబెలింగ్ నిబంధనలు కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని తెలిపారు.
Keralam State Name Change: కేరళ పేరును ‘కేరళమ్’ మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ధరలు పెరిగినా, ఈ ఏడాది వేసవిలో ఏసీల డిమాండ్ పెరుగుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. అమ్మకాలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని తయారీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 30 లక్షల యూనిట్లకు పెంచినట్లు సంస్థ వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో కంప్రెషర్లు, మోటార్లు వంటి కీలక భాగాలను 70 నుంచి 90 శాతం వరకు దేశీయంగా తయారు చేయాలనే ప్రణాళికను కూడా ప్రకటించింది.
ప్రస్తుతం భారత ఏసీ మార్కెట్లో సుమారు 18 శాతం వాటాతో వోల్టాస్ ముందంజలో ఉంది. ఈ సంస్థ ధరలు పెంచిన నేపథ్యంలో ఇతర కంపెనీలు కూడా ధరలను సవరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: