కడప మహానాడు (Mahanadu) వేదికగా తెలుగు ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Naralokesh) ఆరు శాసనాలను ప్రతిపాదించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల ఆత్మగౌరవానికి నిలయంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో కొత్త తరానికి అవసరమైన విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. “తెలుగు ప్రజలకు కష్టమొస్తే మొదట స్పందించేది మనమే” అని చెబుతూ, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే ఈ ఆరు శాసనాలు టీడీపీ భావితరాల అజెండాగా ఉంటాయని చెప్పారు.
ఆరు శాసనాల సారాంశం
లోకేష్ ప్రతిపాదించిన ఆరు శాసనాల్లో తొలి దాని ఉద్దేశ్యం తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం కలిగించడం. రెండవ శాసనంగా “యువగళం” ద్వారా యువతకు అవకాశాలు కల్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలనున్నారు. మూడవ శాసనం “స్త్రీ శక్తి” మహిళల సాధికారతకు మార్గం చూపుతుంది. నాల్గవ శాసనం “సోషల్ రీఇంజినీరింగ్” ద్వారా పేదల అవసరాలను తీర్చడం, ఐదవ శాసనం “అన్నదాతకు అండగా” రైతుల సంక్షేమానికి అంకితమవుతుంది. ఆరవ శాసనంగా “కార్యకర్తే అధినేత” భావనతో పార్టీ కార్యకర్తల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
వివిధ వర్గాల కోసం సంక్షేమ లక్ష్యాలు
ఈ శాసనాల ద్వారా ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం లభిస్తుందని లోకేష్ తెలిపారు. యువత, మహిళలు, రైతులు, బలహీన వర్గాలు, కార్యకర్తలు – ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చే దిశగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన తమ పార్టీ, భవిష్యత్తులో మరింత నూతన మార్గాలను చూపిస్తుందని స్పష్టం చేశారు.
Read Also : Theatre Bandh Issue : ధియేటర్ల ఇష్యూ చేసింది జనసేన నేతనే