Brahma Kumaris Chief Dadi Ratan Mohini passed away

Dadi Ratan Mohini : బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్ మోహిని క‌న్నుమూత‌

Dadi Ratan Mohini : శ‌తాధిక వృద్ధ మ‌హిళ‌, ఆధ్యాత్మిక నేత, బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ అడ్మినిస్ట్రేట‌ర్ దాది ర‌త‌న్‌ మోహిని క‌న్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్ర‌హ్మ‌కుమారిగా ర‌త‌న్ మోహిని రికార్డు నెల‌కొల్పారు. అంత‌కుముందు దాది జాన‌కి.. బ్ర‌హ్మ‌కుమారి సంస్థ చీఫ్‌గా చేశారు. దాది జాన‌కి 1916, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన జ‌న్మించి, 2020, మార్చి 27వ తేదీన మ‌ర‌ణించారు. గ‌త కొన్ని రోజుల నుంచి దాది ర‌త‌న్ మోహిన్ ఆరోగ్యం స‌రిగా లేదు. ఆదివారం సాయంత్రం ఆమె ప‌రిస్థితి మ‌రింత క్షీణించింది.

Advertisements
బ్ర‌హ్మ‌కుమారి చీఫ్ దాది ర‌త‌న్

శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాం తరలింపు

దీంతో రాజ‌స్థాన్‌లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివ‌నంలోని ట్రామా సెంట‌ర్‌కు డ‌యాల‌సిస్ కోసం ఆమెను త‌ర‌లించారు. సోమ‌వారం ఆమె ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌కంగా మారింది. దీంతో క్రిటిక‌ల్ కండీష‌న్‌లో ఉన్న ఆమెను అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 1.20 నిమిషాల‌కు ఆమె తుది శ్వాస విడిచిన‌ట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్ర‌హ్మ‌కుమారి ప్ర‌ధాన కార్యాల‌యంలో శాంతివ‌నంకు ఆమె పార్ధీవ‌దేహాన్ని తీసుకెళ్ల‌నున్నారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో సేవా కార్య‌క్ర‌మాలు

సింధ్‌లోని హైద‌రాబాద్‌లో 1925, మార్చి 25వ తేదీన దాది ర‌త‌న్ మోహిని జ‌న్మించారు. ఆమె ఒరిజిన‌ల్ పేరు ల‌క్ష్మీ. చాలా ఉన్న‌త‌మైన కుటుంబంలో ఆమె జ‌న్మించారు. హైద‌రాబాద్‌, క‌రాచీ నుంచి ఆమె అంత‌ర్జాతీయ స్థాయిలో బ్ర‌హ్మ‌కుమారి ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 1954లో జ‌పాన్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ పీస్ కాన్ఫ‌రెన్స్‌లో బ్ర‌హ్మ‌కుమారీల త‌ర‌పున ఆమె పాల్గొన్నారు. హాంగ్‌కాంగ్‌, సింగ‌పూర్, మ‌లేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె ప‌ర్య‌టించారు.

Read Also: చైనా వాణిజ్య విధానంపై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు

Related Posts
AP : ఏపీకి మరో భారీ ప్రాజెక్టు
AP Project

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు రానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో కీలక పెట్టుబడులు వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు అల్యూమినియం పరిశ్రమలో Read more

తిరుపతి తొక్కిసలాట మృతుల పిల్లలకు ఉచిత విద్య
తిరుపతి తొక్కిసలాట మృతుల పిల్లలకు ఉచిత విద్య

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనలో మరణించిన భక్తుల పిల్లలకు తమ సంస్థల Read more

BCCI 2025 :కాంట్రాక్టు జాబితా రోహిత్, కోహ్లి టాప్ గ్రేడ్‌లో
BCCI 2025 :కాంట్రాక్టు జాబితా రోహిత్, కోహ్లి టాప్ గ్రేడ్‌లో

బిసిసిఐ కాంట్రాక్టు జాబితాలో రోహిత్, విరాట్ టాప్ గ్రేడ్‌లో న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) 2025 సంవత్సరానికి గాను జాతీయ జట్టుకు చెందిన క్రికెటర్ల Read more

తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం
Confusion of GBS cases in East Godavari district

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 రెండు కేసు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×