పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్

పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను రూ.లక్షల్లో డిమాండ్‌ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్హాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపి అనుకూల వ్యక్తిగా, జగన్ వీరాభిమానిగా బోరుగడ్డ అనిల్ కు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కల్యాణ్ వంటి నేతలను కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా సోషల్ మీడియా లో ప్రచారం చేసుకునేవాడు. తన అనుయాయులతో కలిసి రోడ్లపై నానా హంగామా సృష్టించేవాడు. అనిల్‌పై గతంలో పట్టాభిపురం, అరండల్‌పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఫోన్‌ చేసి జగన్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు గురిచేశాడు.

Related Posts
రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్ కు టెండర్లు – ఏపీ సర్కార్
amaravati buildings

అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులు కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కసరత్తు ప్రారంభించింది. Read more

త్వరలో పుతిన్‌తో మాట్లాడతా : డొనాల్డ్ ట్రంప్
Will talk to Putin soon.. Donald Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని పరిష్కరించడంలో సహాయం చేస్తానని చెప్పారు. విస్తృత శ్రేణి సమస్యలపై Read more

Narendra Modi : శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ
Narendra Modi శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ

Narendra Modi : శాంతి ప్రయత్నాలను పాక్ విఫలం చేసిందన్న మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ అమెరికన్ ఏఐ రీసెర్చర్ మరియు పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ Read more

మహారాష్ట్ర ఎన్నికలు 2024: ముంబైలో తక్కువ ఓటు శాతం నమోదు
voting mumbai

మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ముంబై నగరంలో ఈసారి ఓటు శాతం సాధారణంగా తక్కువగా నమోదైంది. 5 గంటల స‌మ‌యం వరకు , ముంబై నగరంలో Read more