prakash raj bolishetty 1

హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది – బొలిశెట్టి

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానుల్లో ఆగ్రహం పెంచుతూ వస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ ఈ లడ్డు వ్యవహారం లో ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేయడం తో కూటమి శ్రేణులు సుప్రీం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..వైసీపీ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ ..పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, కదా? ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి. అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పవన్‌ కళ్యాణ్ గురించే అని, దీక్షలు చేయడం మానేసి పరిపాలన పై దృష్టి పెట్టాలి అంటూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌పైప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటరిచ్చారు. ‘భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్కి కోర్టుకు హాజరవాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు. గొడ్డలికి భయపడా? హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది. మత అపచారాలకు సాక్ష్యాలుండవు. ఆ విషయాలు కోర్టులో తేలవు’అని ట్వీట్ చేశారు.

Related Posts
కొత్త కారు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..ధర తెలిస్తే షాకే
mla mynampally rohit

రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ తెలంగాణలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.3 కోట్ల విలువైన Read more

సమగ్ర కుటుంబ సర్వేలో మీ దగ్గర ఉండాల్సిన ఇవే..!!
Samagra Intinti Kutumba Sur

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey) మొదటి దశ బుధవారం ప్రారంభమైంది. ఈ సర్వే ప్రక్రియలో ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర Read more

కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్
KLH Global Business School Announces Capacity Building Programme

హైదరాబాద్ : డిజిటల్ మరియు సోషల్ మీడియా మార్కెటింగ్‌పై రెండు వారాల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ (సీబీపీ)ని ప్రారంభించినట్లు కెఎల్‌హెచ్‌ గ్లోబల్ బిజినెస్ స్కూల్, హైదరాబాద్ వెల్లడించింది. Read more

Congress : కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6వేల కోట్లు : సీఎం రేవంత్‌ రెడ్డి
Rs. 6 thousand crores for Congress workers.. CM Revanth Reddy

Congress : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభవార్త తెలిపారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రిబవళ్లు కష్టపడి, చదువుకుని ఖాళీగా ఉంటున్న వారికి Read more