Bill Gates happy over agreements with AP government

Bill gates : ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్‌ గేట్స్‌ హర్షం

Bill gates : మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో బిల్‌ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి గేట్స్‌ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు చేసుకున్నారు.

ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలపై బిల్‌

ఏఐ, శాటిలైట్‌ ఆధారిత వ్యవస్థలు

అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ఐదు రంగాల్లోని సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని, వాటిని వినియోగంలోకి తెస్తారు. ఈ ఒప్పందం ద్వారా గేట్స్‌ ఫౌండేషన్‌.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేసే భాగస్వామ్య సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తుంది. కృత్రిమ మేధను ఉపయోగించి రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలను ముందుగానే విశ్లేషించి, అందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. ఏఐ, శాటిలైట్‌ ఆధారిత వ్యవస్థల ద్వారా పంటల సాగులో అనుసరించాల్సిన విధానాలు, వనరుల నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా సలహాలు, సూచనలు అందిస్తుంది.

వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన

రాష్ట్ర పురోగతికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ముందుకొచ్చిన గేట్స్‌ ఫౌండేషన్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. బిల్‌ గేట్స్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ సమన్వయంతో ఎలా కలిసి పనిచేయాలన్న అంశంపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగాల కల్పన వంటి విషయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృత్రిమ మేధ, ప్రెడిక్టివ్‌ అనలిటిక్స్‌ వినియోగంపై చర్చించాం. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది.

Related Posts
బుల్లి రాజు ను రాజకీయాల్లోకి లాగొద్దు.
బుల్లి రాజు ను రాజకీయాల్లోకి లాగొద్దు.

బుల్లి రాజుగా తెరంగేట్రం చేసిన బాల నటుడు రేవంత్ భీమాల 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో నటించిన విషయం తెలిసిందే, రేవంత్ భీమాల కు కొత్త చిక్కులు వచ్చి Read more

ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు తీపి కబురు
andhra pradesh

ఏపీ ప్రభుత్వం పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధించే దిశగా.. వంద రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా రెండో శనివారం, ఆదివారాల్లో పదో Read more

మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పిన హైడ్రా
hydhydraa

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. ఆల్వాల్ ప్రాంతంలో ప్రభుత్వం భూమిని Read more

“బుజ్జి తల్లి” పాటను శోభితకు అంకితం చేసిన నాగ చైతన్య
"బుజ్జి తల్లి" పాటను శోభితకు అంకితం చేసిన నాగ చైతన్య

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన పాన్-ఇండియా చిత్రం "తండేల్" ఫిబ్రవరి 7న విడుదల కానుంది. విడుదలకు ముందు, చిత్ర బృందం హైదరాబాద్లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *