Bhumana Karunakar Reddy కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన

Bhumana Karunakar Reddy : కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన

Bhumana Karunakar Reddy : కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన ఆంధ్రప్రదేశ్‌లో కాశీనాయన క్షేత్రం కూల్చివేత వెనుక అసలు దోషులను బయటకు తీయాలని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయని విమర్శించారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం అంటే హిందూ ధర్మంపై బుల్డోజర్ తో దాడి చేయడమే అని భూమన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.అటవీశాఖ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నా, ఆశ్చర్యకరంగా అదే శాఖ అధికారులు కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం ఏంటి అని ఆయన నిలదీశారు. పవన్, లోకేశ్ మధ్య భేదాలు భూమన ఆరోపణలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మధ్య పూర్తి భేదాభిప్రాయాలున్నాయి అని భూమన వ్యాఖ్యానించారు.

Advertisements
Bhumana Karunakar Reddy కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన
Bhumana Karunakar Reddy కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన

లోకేశ్ క్షమాపణ చెప్పడం
ఆలయాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇవ్వడం
అదే సమయంలో పవన్ మాత్రం మౌనం వహించడం

ఇవి టిడిపి-జనసేన కూటమిలో అంతర్గత కలహాలకు నిదర్శనమని భూమన కటువచనాలు పేల్చారు.

పవనానంద స్వామి ఎక్కడ – భూమన ప్రశ్న

సనాతన ధర్మ పరిరక్షణ గురించి గట్టిగా మాట్లాడే పవనానంద స్వామి ఇప్పుడు మౌనంగా ఉండటం ఏమిటని భూమన నిలదీశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు మాత్రం ఎందుకు నోరు విప్పడం లేదు అని ఆయన ప్రశ్నించారు.

శ్రీశైలం కూడా టార్గెట్ – భూమన అనుమానం

కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పిన తీరు చూస్తే, రేపు శ్రీశైలం ఆలయాన్నీ కూల్చేస్తారేమోనని అనుమానం కలుగుతోంది అని భూమన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో, కాశీనాయన ఆలయాన్ని అటవీ చట్టాల నుంచి మినహాయించాలంటూ కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు.ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆదేశాలు లేకుండానే కూల్చివేతలు జరిగాయా అని ప్రశ్నించారు.

బీజేపీ మౌనం ఎందుకు


నిజంగా హిందూ ఆలయాల రక్షణకే బీజేపీ పని చేస్తుందా అని భూమన ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ఇప్పటికీ ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన నిలదీశారు. కూటమి పాలనలో హిందూ ధర్మానికి గడ్డుకాలం ఇప్పటి పాలనలో హిందూ ధర్మం ముప్పుతిప్పలు పడుతోంది అని భూమన విమర్శించారు.కూటమి పార్టీల పని వైసీపీపై బురదజల్లడం మాత్రమే ఇప్పటివరకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడమే వారి ధ్యేయం

Related Posts
అమరావతికి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
amaravathi babu

అమరావతికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు కీలక నిర్ణయాలు Read more

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం
Etikoppaka Toys Shakatam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం లభించింది. ఈసారి జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే కవాతులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల Read more

నేడు నెల్లూరులో పర్యటించనున్న చంద్రబాబు
CM Chandrababu will visit Nellore today

స్వచ్చ ఆంధ్ర–స్వచ్చ దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో Read more

యాదవ కార్పొరేషన్ చైర్మన్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu attend

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి లోక్ సభ స్థానం టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. Read more

×