ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ప్రారంభించిన ‘వేవ్స్’ సమ్మిట్తో భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారే దిశగా మరింత ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్గా మొదలైన ఈ కార్యక్రమం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మకతకు వేదికగా నిలవనుంది. స్టార్టప్స్, క్రియేటర్లు, పాలసీ మేకర్లు, ఇండస్ట్రీ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ సదస్సు ద్వారా భారత్ను మాధ్యమం, వినోదం, డిజిటల్ ఆవిష్కరణలలో ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాలన్నదే లక్ష్యమని మోదీ తెలిపారు.చిత్ర నిర్మాణం, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, మ్యూజిక్, కాన్సర్ట్ల వంటి రంగాల్లో భారతదేశం కేంద్రీకృత హబ్గా ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ ప్రతిభకు ఒక వేదికను అందించే సామర్థ్యం ‘వేవ్స్’కి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో సృజనాత్మక బాధ్యత అవసరమని, మనుషులు రోబోలుగా మారకూడదని ప్రధాని హితవుపలికారు. అసభ్య కంటెంట్ విషయంలో మీడియా, ఓటీటీల బాధ్యతను కూడా గుర్తు చేశారు.
Bharat : భారతదేశం ఎంటర్టైన్మెంట్ మరియు సృజనాత్మకత యొక్క గ్లోబల్ హబ్గా ఎదుగుతోంది

ఇందులో భాగంగా, భారత్ కథల పుట్టినిల్లు అనే విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘‘స్క్రీన్లు చిన్నవవుతున్నా, భారత కథలు మరింత గొప్పవవుతున్నాయి. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశం వందల కోట్ల కథల నిలయం’’ అని వ్యాఖ్యానించారు. భారతీయ సినిమా ప్రపంచానికి భారతీయ సంస్కృతిని పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. గత శతాబ్దంలో రష్యాలో రాజ్కపూర్కు, సత్యజిత్ రేకు కేన్స్లో లభించిన ఆదరణ, ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అస్కార్లో లభించిన అంతర్జాతీయ గుర్తింపు, భారత కథల శక్తికి నిలువెత్తు ఉదాహరణలుగా పేర్కొన్నారు.ఈ సమ్మిట్ ద్వారా భారత యువత, సృజనాత్మక రంగాలపై ఆసక్తి కలిగినవారికి అంతర్జాతీయ వేదికలు అందుబాటులోకి రానున్నాయి. వినోదరంగ అభివృద్ధి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా కొత్త ఉత్సాహం తేవడం వేవ్స్ సమ్మిట్ లక్ష్యమవుతుంది.
Read More : Metro : హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం