జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ తన శక్తిని అన్ని వైపుల నుంచి ప్రదర్శించడం ప్రారంభించింది. ఈ క్రమంలో, భారత్ ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని ఏప్రిల్ 26న నిలిపివేయగా, దానికి కొనసాగింపుగా బాగ్లిహార్ డ్యామ్ నుండి పాకిస్థాన్కు నీటి సరఫరాను కూడా నిలిపివేసింది. చినాబ్ నదిపై నిర్మించిన ఈ డ్యామ్ ద్వారా పంజాబ్ ప్రావిన్స్లోని పంట పొలాలకు నీటి సరఫరా జరుగుతోంది. అయితే, భారత్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం పాకిస్థాన్ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపనుంది.బాగ్లిహార్ డ్యామ్ 2008లో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించబడింది. దీని పొడవు దాదాపు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం ప్రకారం చినాబ్ నది నీటిపై పాకిస్థాన్కు ఎక్కువ హక్కులు ఉన్నాయి. అయినప్పటికీ, ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ ఎలాంటి సహనాన్ని చూపించకుండా నీటి ప్రవాహాన్ని ఆపివేసింది. మే 1 నాటికి ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ నీటి నిలిపివేత వెలుగులోకి వచ్చింది. చినాబ్ నది సియాల్కోట్ వద్దకు చేరేసరికి పూర్తిగా ఎండిపోయినట్లు నిపుణులు గుర్తించారు.

Bharat : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ బాగ్లిహార్ డ్యామ్ నీటిని నిలిపివేసింది.
ఈ నీటి కొరత వల్ల పాక్ పంజాబ్లోని పత్తి, వరి వంటి ప్రధాన పంటలకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, గత వారం జీలం నదిలో వచ్చిన వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ ప్రాంతాన్ని వణికించింది. నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో హట్టియన్ బాలా ప్రాంతంలో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ఇప్పటికే భారత్ చేర్చిన ఈ చర్యల నేపథ్యంలో పాకిస్థాన్పై భారతదేశం ఉగ్రవాదానికి బదులుగా నీటి దౌత్యంతో ఎలా ఒత్తిడి తీసుకొస్తోందో స్పష్టమవుతోంది. ఇది స్వల్పకాల చర్య అని అధికారులు చెబుతున్నా, భవిష్యత్తులో మరింత కఠిన నిర్ణయాల కోసం ఇది ముందస్తు హెచ్చరిక కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More : Tragedy : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మృతి