elections

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై లక్షల కోట్ల బెట్టింగ్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ , భారతీయ జనతా పార్టీ మధ్య హోరీహోరీ పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తుంటే, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కసితో ఉంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. పెద్దగా ఒపీనియన్ పోల్స్ అందుబాటులో లేకపోవడంతో, అందరి దృష్టి రాజస్థాన్‌లోని ఫలోడి సత్తా బజార్ (బెట్టింగ్ మార్కెట్) అంచనాలపైనే ఉంది. ఢిల్లీలో AAP 2015 నుంచి అధికారంలో ఉంది. గత 27 సంవత్సరాల్లో బీజేపీ ఢిల్లీ అధికారంలోకి రాలేదు.
ఫలోడి సత్తా బజార్ అంచనా ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీకి గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలే గెలుస్తుంది. 2013లో 28 సీట్లు గెలుచుకున్న ఆప్ 2015లో 70కి గానూ 67 సీట్లు సాధించింది. ఈసారి అధికార పార్టీ 38-40 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ విషయానికి వస్తే, వారికి 30-32 సీట్లు వస్తాయని బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. బీజేపీ బలమైన పోటీ ఇస్తుంది.

కీలక ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ (ఆప్) వర్సెస్ పర్వేశ్ వర్మ (బీజేపీ) వర్సెస్ సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) మధ్య పోటీ జరగనుంది. ఇక్కడ కేజ్రీవాల్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. బెట్టింగ్ ఆడ్స్ ఆయనకు 66-85 మధ్య ఉన్నాయి. కల్కాజీ నియోజకవర్గంలో అతిషి (ఆప్), రమేష్ బిధురి (బీజేపీ), అల్కా లాంబా (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. ఇక్కడ అతిషి ముందంజలో ఉన్నారు. ఆమె గెలుపు అవకాశాలు (బెట్టింగ్ ఆడ్స్) 25-33 మధ్య ఉన్నాయి. జంగ్‌పురా నియోజకవర్గంలో మనీష్ సిసోడియా (ఆప్), తర్వీందర్ సింగ్ మార్వా (బీజేపీ), ఫర్హాద్ సూరి (కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సిసోడియా బెట్టింగ్‌ ఆడ్స్‌ 55-70 మధ్య ఉన్నాయి.

Related Posts
తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు
train

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు Read more

కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Encounter in Kupwara. Terrorist killed

శ్రీనగర్‌: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం Read more

ఇన్ఫోసిస్ నుంచి 400 మంది ట్రైనీల తొలగింపు
ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్

దేశంలో టాప్ ఐటీ కంపెనీల్లో కొన్ని మాత్రం పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాప్ రెండవ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురించే. Read more

సోనియాను కలిసిన సీఎం రేవంత్
revanth sonia

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *