Begumpet railway station to be inaugurated soon.. Kishan Reddy

Kishan Reddy : త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభం: కిషన్‌రెడ్డి

Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మరో పది శాతం పనులు పూర్తికావాల్సి ఉందని వివరించారు. విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని అన్నారు.

త్వరలోనే బేగంపేట రైల్వే

దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి

బేగంపేట రైల్వేస్టేషన్‌లో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తాం. రూ.26.55 కోట్లతో మొదటివిడత పనులు జరుగుతున్నాయి. మరో రూ.12 కోట్లతో రెండోవిడత పనులు పూర్తి చేస్తాం. ప్రయాణికులకు ఇబ్బందిలేకుండా దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు రైల్వేస్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేది. ప్రధాని మోడీ స్వచ్ఛభారత్ ద్వారా స్వచ్ఛ రైల్వేస్టేషన్ పేరుతో వినూత్న మార్పులను తీసుకొచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని కూడా అధునాతనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నాం అన్నారు.

వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి?

త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమపై హిందీ రుద్దుతోందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదు. ఏ భాష కావాలంటే అందులో చదువుకునే అవకాశం ఉంది. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి రూ.కోట్లు లాభాలను నిర్మాతలు పొందుతున్నారు. వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయి? భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదు అన్నారు.

Related Posts
రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly sessions continue for second day

హైదరాబాద్‌: నేడు రెండో రోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవా వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ Read more

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..
AP Assembly budget meetings from 24th of this month

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు Read more

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

శ్రీతేజ్ పరిస్థితి గురించి కిమ్స్ డాక్టర్లు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. బాలుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు తెలిపారు. చికిత్సకు స్వల్పంగా స్పందిస్తున్న శ్రీతేజ్‌ Read more

పోసాని అరెస్టుతో వైసీపీ నిరసనలు.
పోసాని కృష్ణమురళి కేసుపై కీలక పరిణామాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *