हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Basavatarakam: రేపు అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన

Sharanya
Basavatarakam: రేపు అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన

అమరావతిలో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన దిశగా మరో కీలక అడుగు పడుతోంది. రాజధాని పరిధిలో బసవతారకం (Basavatarakam) క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది.

తుళ్లూరు – అనంతవరం మధ్య వైద్య కేంద్రం

తుళ్లూరు – అనంతవరం (Thullur– Anantavaram) గ్రామాల మధ్య విస్తరించిన 21 ఎకరాల భూమిపై ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధి సంస్థ (CRDA) తాజాగా కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

బాలకృష్ణ హాజరయ్యే శంకుస్థాపన కార్యక్రమం

ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, నటుడు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. ఆయనే ఈ ఆసుపత్రి అభివృద్ధికి కీలకంగా కృషి చేస్తున్నారు.

తొలి దశలో 300 పడకలు – భవిష్యత్తులో విస్తరణ

అమరావతిలో నిర్మించనున్న ఈ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభ దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. తర్వాత దాన్ని 1000 పడకల సామర్థ్యానికి విస్తరించే ప్రణాళిక ఉందని సమాచారం.

ఈ ఆసుపత్రికి సంబంధించి తొలి ప్రణాళికలు 2014–2019 కాలంలోనే రూపొందినవే. అప్పట్లోనే భూమి కేటాయించినప్పటికీ, 2019లో పాలన మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి భూమి కేటాయించడంతో ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870