Babu who did PhD in cheating..Jagan

చీటింగ్ లో పీహెచ్ డీ చేసిన బాబు: జగన్‌

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం ఉదయం మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ఒక్క సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని చెప్పినట్లు జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని చెప్పినట్లు గుర్తుచేశారు.

ఈ తొమ్మిది నెలల కాలానికి బడ్జెటరీ అకౌంట్ అప్పులే రూ.80 వేల కోట్లని జగన్ వివరించారు. అమరావతి పేరుతో రూ.52 వేల కోట్లు, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లయి ద్వారా రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా రూ. 5 వేల కోట్లు.. మొత్తంగా రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. మరి ఇన్ని అప్పులు చేసిన ప్రభుత్వం ఎన్ని బటన్ లు నొక్కిందని, ఎంతమంది పేదలకు డబ్బు పంచిందని జగన్ నిలదీశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలలోనే ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అప్పులు చేయడంలో చంద్రబాబు సర్కారు అన్ని రికార్డులను బద్దలు కొట్టిందని విమర్శించారు.

image

ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్లను ఎలా మోసం చేసిందో చూశామని, కొత్తగా ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.6 లక్షల మంది వలంటీర్లతోపాటు బెవరేజెస్ లోని 18 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. తమ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం, రైతు భరోసా, వసతి దీవెన తదితర పథకాలకు కూటమి సర్కారు మంగళం పాడిందని జగన్ ఆరోపించారు. ఆ పథకాలను నిలిపివేసిందని విమర్శించారు.

Related Posts
పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి
పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారంపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల రాయచోటి పోలీసులు పోసానిని అరెస్ట్ Read more

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌
Minister Payyavula Keshav presented the budget in the Legislative Assembly

అమరావతి: ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ 2024-25ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ కాపీస్‌లోని పద్దులను చదివి వినిపిస్తున్నారు. అంతకుముందు ఆయన Read more

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు – వంశీ అనుచరులు అరెస్ట్
Gannavaram TDP office attack case

విజయవాడ: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. Read more

ఒంగోలు పోలీసులు సన్నద్ధం! ఆర్జీవీ vs పోలీసులు ??
varma

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)పై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌పై అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలపై Read more