avanthi srinivas resigns ycp

జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత

గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుతం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన పార్టీని, పలువురు కీలక నాయకులు వీడడం మరింత షాక్ కు గురి చేస్తుంది. ఇటీవల మగ్గురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా జెడ్పీ ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ, రాజీనామాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా, వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసారు. పార్టీ కార్యకలాపాలకు ఆయన గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ వ్యవహారశైలి, పార్టీ పని తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు.ఇక ఇప్పుడు తన అనుచరులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆవంతి రాజీనామా వైసీపీకి గట్టి దెబ్బగా మారనుంది. అవంతి వంటి కీలక నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఎన్నికల ముందు పార్టీ క్రమశిక్షణలో మార్పులు తేవాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, నాయకత్వంలో ఉన్న విభేదాలు ఇంకా పరిష్కరించలేకపోయారు. అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అవంతి నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేతగా ఉన్నందున, ఆయన నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది.

Related Posts
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్
గాజాను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20 మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. ఈ నిర్ణయం అమెరికా రాజకీయ Read more

నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్
Today Congress Chalo Raj Bhavan

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప Read more

పుతిన్ మోసపూరిత చర్యలపై జెలెన్‌స్కీ ఆగ్రహం
ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే ప్రాణాలతో బతుకుతారు – పుతిన్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. కాల్పుల విరమణ విషయమై పుతిన్ చూపుతున్న మోసపూరిత ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. Read more

రూ .2.98 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..
Assembly meeting from today. Cabinet approves AP budget

అమరావతి: ఈరోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో Read more