हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Parliament : పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల అటెండెన్స్.. టాప్‌లో ఉంది ఎవరంటే !

Sudheer
Parliament : పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల అటెండెన్స్.. టాప్‌లో ఉంది ఎవరంటే !

ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ సమావేశాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయి. చట్టాల తయారీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవే ప్రధాన వేదిక. ప్రజల భాధ్యతను మోయాల్సిన ఎంపీలు సభ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఈ క్రమంలో తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన 17 మంది ఎంపీల హాజరు శాతం, వారు అడిగిన ప్రశ్నలు, పాల్గొన్న చర్చల వివరాలను వెలిబుచ్చే గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలు

జూన్ 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 100 శాతం హాజరుతో టాప్‌లో నిలిచారు. ఆయన 79 ప్రశ్నలు వేసి, 17 చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 95 శాతం హాజరుతో రెండో స్థానంలో ఉండగా, బీజేపీ నేత ఈటల రాజేందర్ అత్యధికంగా 80 ప్రశ్నలు వేసి, 91 శాతం హాజరుతో తన చురుకుదనాన్ని చాటుకున్నారు. ఇక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చల్లో పాల్గొనడం గమనార్హం.

telangana mps parliament
telangana mps parliament

కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు

మరోవైపు, కొంతమంది ఎంపీలు తక్కువ హాజరుతో పాటు, తక్కువ ప్రశ్నలు వేయడం, చర్చల్లో పాల్గొనకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఉదాహరణకు కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘువీర్ కేవలం 8 ప్రశ్నలు వేసి, 72 శాతం హాజరుతో ఒక్క చర్చలోనూ పాల్గొనలేదు. ఇదే సమయంలో ఇతర ఎంపీల హాజరు శాతం, చర్చలలో భాగస్వామ్యం కూడా ఎంపీగా వారి నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఈ గణాంకాలపై ప్రజల దృష్టి కేంద్రీకరించడంతో భవిష్యత్తులో ఎంపీలు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870