స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న AA22 (వర్కింగ్ టైటిల్) సినిమాపై దర్శకుడు అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే సత్యభామ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న అట్లీ, తన మాటలతో సినిమాపై ఉత్కంఠను పెంచేశారు.ఈ సినిమా గురించి మాట్లాడుతూ అట్లీ,(Atlee) ఇది సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఉంటుంది అని చెప్పారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత భారీ సినిమాలలో ఒకటిగా దీనిని తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ప్రేక్షకులకు గర్వకారణంగా ఉండేలా ఈ సినిమాను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.
బడ్జెట్పై స్పష్టత రాలేదన్న అట్లీ
ఈ సినిమా నిర్మాణం ఎంత ప్రాంప్ట్గా సాగుతున్నా, బడ్జెట్ విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తేలలేదని అట్లీ తెలిపారు. అయినా ఇది ఒక ప్యాన్ ఇండియా లెవెల్ మూవీగా రూపొందుతోందని, స్పష్టంచేశారు.
రిలీజ్ డేట్ నిర్ణయం నిర్మాతలే నిర్ణయిస్తారు
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదల తేదీ విషయంలో తుది నిర్ణయం ఆయనదే అని అట్లీ చెప్పారు. ఇది చూసిన ప్రతి ప్రేక్షకుడికి గర్వంగా అనిపించేలా ఉండబోతుందని తెలిపారు.అల్లు అర్జున్ నటిస్తుండటంతో ఈ సినిమా పై అభిమానులలో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తుండటంతో ఈ కాంబినేషన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు నుంచే క్రేజ్ తారాస్థాయికి చేరుతోంది.
Read Also : Telangana Gaddar Film Awards : అట్టహాసంగా గద్దర్ అవార్డు వేడుకలు