Ashok Leyland plant to be inaugurated in AP today

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ఈరోజు సాయంత్రం 5గంటలకు మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. భారీ పెట్టుబడులతో మల్లవల్లిలో బస్సు ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ప్రారంభంతో రాష్ట్రానికి మరో కీలక పరిశ్రమ రానుంది. ప్లాంట్ ద్వారా ఏపీలో ఆటోమొబైల్ రంగానికి జోష్ రానుంది. మల్లవల్లి యూనిట్ నుంచి దేశవ్యాప్తంగా బస్సుల సరఫరా ఉంటుంది.

Advertisements
నేడు ఏపీలో అశోక్ లేలాండ్

1200 మందికి ఉద్యోగాలు

పరిశ్రమల విస్తరణలో మరో మెట్టుపై ఏపీ నిలువనుంది. తొలివిడతలో 600మందికి, మలివిడతలో 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో అశోక్‌ లేల్యాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో ఆ సంస్థ ఎలక్ర్టికల్‌ బస్‌ బాడీ బిల్టింగ్‌ ప్లాంట్‌ నెలకొల్పింది. దీనిని అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసేలోపు అధికారంలోకి వైసీపీ వచ్చింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం అశోక్‌ లేల్యాండ్‌కు తగిన సహకారం ఇవ్వలేదు.

మొట్టమొదటి ఆటోమొబైల్‌ ప్లాంటు ఇది

కొవిడ్‌ అనంతర పరిస్థితులు కూడా ప్లాంట్‌ కార్యకలాపాలకు ఆటంకంగా మారాయి. కూటమి ప్రభు త్వం వచ్చాక అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ప్లాంట్‌ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఎలక్ర్టికల్‌ బస్సులే కాకుండా అన్ని రకాల బస్సులకు బాడీ బిల్డింగ్‌ చేసే దిశగా ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి ఆటోమొబైల్‌ ప్లాంటు ఇది. ఈ ప్లాంట్‌లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు బీఎస్‌- 6 మోడళ్ల బస్సులను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు ఫేజ్‌-1, 2లలో సంవత్సరానికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.

Related Posts
రాజీనామా పై అవంతి శ్రీనివాస్‌ క్లారిటీ
Avanthi Srinivas clarity on resignation

అమరావతి: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తన రాజీనామాకు గల కారణాలను ఆయన స్పష్టతనిచ్చారు. రాజకీయాల వల్ల కుటుంబానికి Read more

తెలంగాణలో మొదలైన కులగణన
census survey telangana

తెలంగాణ లో ఈరోజు కులగణన సర్వే మొదలైంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై Read more

ఉత్తరప్రదేశ్‌ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
UP by elections. First list of BJP candidates released

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ నేడు (గురువారం) విడుదల చేసింది. రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లో జరిగే Read more

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశం
biden zinping

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, శనివారం పెరూ లో జరిగిన ఏషియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) ఫోరమ్ సమ్మిట్ సమయంలో Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×