ఎంపిహెచ్ఎల తొలగింపుపై

CM Revanth : తెలంగాణ సీఎం పై ఏపీ మంత్రి ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని గాడ్సేతో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, తన చేతకానితనాన్ని దాచిపెట్టేందుకు కేంద్ర నేతలపై విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ స్థాయి నేతగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ పద్ధతులకు, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

Advertisements
Telangana: మంత్రివర్గ విస్తరణ తుది కసరత్తు పూర్తి!

రేవంత్ మాటల వెనుక ఉద్దేశం ఏమిటి?

సత్యకుమార్ ప్రకారం, రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల్లో తాను పట్టు కోల్పోతున్న పరిస్థితిలో, వాటి నుంచి దృష్టిని మళ్లించేందుకు మోదీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పదవి కాపాడుకోవడం కోసం అర్థం లేని, తీవ్రతరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తి తగిన బాధ్యతను చూపించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

రేవంత్‌కి గాంధీ కుటుంబం మద్దతు అంతేనా?

బీజేపీని అడ్డుకోవడం నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ లాంటి శక్తివంతమైన నాయకులకు సాధ్యపడలేదని, అలాంటప్పుడు గాంధీ కుటుంబ మద్దతుతో ఎదిగిన రేవంత్ రెడ్డి ఏం చేయగలడని సత్యకుమార్ ఎద్దేవా చేశారు. రేవంత్ గాంధీ కుటుంబానికి మోచేతి నీళ్లు తాగే స్థాయికి పరిమితమయ్యాడని, అటువంటి వ్యక్తి దేశ ప్రధానిపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రాజకీయ వ్యూహాలకు మించిన ప్రజల విశ్వాసం కీలకమని, రేవంత్ రెడ్డి ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు.

Related Posts
ఇక పై తిరుమల అన్నప్రసాదంలో వడలు ?
TTD introduced masala vada in Tirumala Annaprasadam?

తిరుమల: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని Read more

నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా !
Rythu Bharosa for farmers who have less than 3 acres from today!

రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ హైరదాబాద్‌: తెలంగాణలో నేటి నుంచి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వేయనున్నారు. ఈ Read more

6న తెలంగాణ క్యాబినెట్ భేటీ
Telangana Cabinet M9

క్యాబినెట్ భేటీ తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 6న సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు Read more

మాకు రాష్ట్రాలతో కాదు దేశాలతోనే పోటీ – నారా లోకేశ్
మాకు రాష్ట్రాలతో కాదు దేశాలతోనే పోటీ - నారా లోకేశ్

ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్..సోమవారం కేంద్ర మంత్రి జయంత్ చౌధురి మరియు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, రాష్ట్రంలో నైపుణ్య గణనకు సహకరించాలని మరియు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×