pongal movies

సంక్రాంతి సినిమాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

సంక్రాంతి బరిలో ఒకటి , రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సిని మాలు బరిలోకి దిగుతున్నాయి. ముందుగా శంకర్ – రామ్ చరణ్ కలయికలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 న పాన్ ఇండియా గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమా పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దాదాపు మూడేళ్ళ పాటు నిర్మితమైన ఈ మూవీ కోసం మెగా అభిమానులే కాదు యావత్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Advertisements

జనవరి 12 న నందమూరి బాలకృష్ణ – బాబీ కలయికలో తెరకెక్కిన డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మించిన ఈ మూవీ పై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య..డాకు మహారాజ్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని అభిమానులు ధీమా గా ఉన్నారు.

వీటితో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా జనవరి 14 న రిలీజ్ అవుతుంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కిన ఈ మూవీ పై ఫ్యామిలీ ఆడియన్స్ లలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించి మేకర్స్ లలో సంతోషం నింపింది.

గేమ్ ఛేంజర్ తొలిరోజు 6 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు అనుమతినిచ్చింది. JAN 10న అర్ధరాత్రి ఒంటిగంట షో (బెన్ఫిట్)కు టికెట్ రూ.600కు అమ్ముకోవచ్చని తెలిపింది. మిగతా 5 షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్పై రూ.175, సింగిల్ స్క్రీన్లపై రూ.135 హైక్ ఇచ్చింది. 23వ తేదీ వరకూ రోజుకు ఐదు షోలకు హైక్తో టికెట్స్ విక్రయించుకోవచ్చని చెప్పింది.

డాకు మహారాజ్ సినిమా రిలీజయ్యే జనవరి 12న ఉ.4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500గా నిర్ణయించింది. ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. వాటికి మల్టీప్లెక్సుల్లో టికెట్పై రూ.135, సింగిల్ స్క్రీన్లపై రూ.110 హైక్ ఇచ్చింది.

Related Posts
డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కీలక ప్రకటన
Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డిసెంబర్ 8 (ఆదివారం) జరిగిన ప్రకటనలో, ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధాన్ని ఆపాలని, వెంటనే కాల్పుల ఆపుదల మరియు చర్చలు Read more

గాయంతో హీరోయిన్ రష్మిక..ఫొటోస్ వైరల్
rashmika gayam

జిమ్‌లో గాయపడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక తన తాజా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె గాయపడిన నేపథ్యంలో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. Read more

5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ
5 లక్షలతో పట్టుబడిన..సీఎం కార్యాలయ ఉద్యోగులు..ఢిల్లీ

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు రూ. 5 లక్షల నగదుతో పట్టుబడ్డారు Read more

బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య
r krishnaiah

త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్య Read more

Advertisements
×