Ramadan 2025

ముస్లిం ఉద్యోగులకు వెసలుబాటు కల్పించిన ఏపీ సర్కార్

ముస్లిం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం

Advertisements

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త అందించింది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు విధుల నుంచి గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని, అధికారులకు తగిన సూచనలు చేశారు.

మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఈ వెసులుబాటు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల కారణంగా ముస్లిం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

AP government good news for

ఇక ముస్లింలకు మరో శుభవార్తగా, రంజాన్ తోఫా పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సంక్రాంతి, రంజాన్ పండుగల సందర్భంగా నిత్యావసర వస్తువులను అందించింది. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ ప్రభుత్వం తిరిగి తీసుకురానుంది.

అంతేకాకుండా, ముస్లిం మతపెద్దలు ఇమామ్, మౌజమ్‌లకు వేతనాలను త్వరగా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచనలు అందించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రంజాన్ మాసంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related Posts
ఏపీలో గ్రూప్​-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు విడుదల
exams

ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ Read more

కౌశిక్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ కోసం వస్తామని చెప్పి రాలేదేంటి ..కాంగ్రెస్ ప్రశ్న
paadi koushik

డ్రగ్స్ పరీక్షల అంశంపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతలు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ బల్మూరి Read more

సిరియాలోని ఇడ్లిబ్ నగరంపై తీవ్ర వైమానిక దాడులు..
idlib strikes

సిరియాలోని ఉత్తర ప్రాంతం, ముఖ్యంగా ఇడ్లిబ్ నగరం, ఆదివారం రష్యా మరియు సిరియన్ వైమానిక దాడుల లక్ష్యంగా మారింది. ఈ దాడులు, తిరుగుబాటుదారుల చేతిలో ఉన్న నగరాలను Read more

మణిపూర్‌లో హింసాత్మక నిరసనలు
Ongoing Clashes in Manipur

భారతదేశం యొక్క ఈశాన్యభాగాన ఉన్న రాష్ట్రమైన మణిపూర్‌లో ఆరుగురు మహిళలు మరియు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిమీద అపహరణ చేసి హత్య చేసినట్లు మెయ్‌టై సమాజం సభ్యులు Read more

×