AP government innovative program...Awards for MPs and MLAs!

AP Govt : ఏపీ ప్రభుత్వం వినూత్న కార్య‌క్ర‌మం..ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు!

AP Govt : ప్ర‌జ‌ల‌కు ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను మ‌రింత చేరువ చేసేందుకు ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం మరో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఎవ‌రైతే ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుని వారి కోసం అసెంబ్లీలో, పార్ల‌మెంట్‌లో పోరాటం చేస్తారో వారికి అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. పార్టీల‌కు అతీతంగా ఈ అవార్డుల ప్ర‌దానం ఉంటుంద‌ని తెలిపింది. ఏ పార్టీ ఎంపీలు‌, ఎమ్మెల్యేలు అయినా స‌రే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని కోరింది. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీ, పార్ల‌మెంట్‌కు వినిపిస్తార‌ని భావిస్తోంది.

Advertisements
 ఏపీ ప్రభుత్వం వినూత్న కార్య‌క్ర‌మం

విజేత‌ల ఎంపిక కోసం ఓ ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు

ఇందులో భాగంగా స‌భ‌లో స‌భ్యుల ప‌నితీరు, వారి ప్ర‌వ‌ర్త‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అవార్డు అంద‌జేయనుంద‌ని తెలుస్తోంది. కాగా, విజేత‌ల ఎంపిక కోసం ఓ ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేసి, ఆ క‌మిటీ ఎంపిక చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల‌కు అవార్డులు అందిస్తార‌ని స‌మాచారం. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో గ‌ళం విప్పితే ‘ఉత్త‌మ లెజిస్లేచ‌ర్‌’, అదే పార్ల‌మెంట్లో అయితే ‘ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్’ త‌ర‌హాలో అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

మరిన్ని ప్రజా సేవలపై దృష్టి

ఈ అవార్డుల కార్యక్రమం మార్చి నెలాఖరులో జరిగే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో భారీగా నిర్వహించే ఈ వేడుకలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని కొనియాడే అవకాశం ఉంది. ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ అవార్డులు తీసుకోవడం ద్వారా నేతలు తమ పనితీరును మెరుగుపరచుకుంటూ మరిన్ని ప్రజా సేవలపై దృష్టి పెడతారు.

Related Posts
పోలీసు విచారణకు టాలీవుడ్ హీరోయిన్లు?
Heroines Kajal and Tamannaah will be interrogated by the police

క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ మోసం.. న్యూఢిల్లీ: పుదుచ్చేరిలో జరిగిన క్రిప్టో కరెన్సీ మోసానికి సంబంధించి టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా, కాజల్‌ అగర్వాల్‌లను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు. Read more

అయోధ్య రామాల‌యం దేశ ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌ : ప్రధాని
Ayodhya Ram Temple is an inspiration to the people of the country.. Prime Minister

న్యూఢిల్లీ: అయోధ్య‌లో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్‌ల‌ల్లాను ప్ర‌తిష్టాప‌న చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు Read more

ఆలుబాక శివారులో పెద్దపులి సంచారం
tiger

వెంకటాపురం మండలం ఆలుబాక శివారులో పెద్దపులి సంచరిస్తున్న వార్త స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆలుబాక-బోధాపురం మార్గంలో గోదావరి పాయ దగ్గర పులి అడుగుల జాడలు కనిపించడంతో Read more

జాకీర్ హుస్సేన్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ ల సంతాపం
zakir hussain

ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మృతి చెందడంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం Read more

×