AP government innovative program...Awards for MPs and MLAs!

AP Govt : ఏపీ ప్రభుత్వం వినూత్న కార్య‌క్ర‌మం..ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు!

AP Govt : ప్ర‌జ‌ల‌కు ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను మ‌రింత చేరువ చేసేందుకు ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం మరో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఎవ‌రైతే ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుని వారి కోసం అసెంబ్లీలో, పార్ల‌మెంట్‌లో పోరాటం చేస్తారో వారికి అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. పార్టీల‌కు అతీతంగా ఈ అవార్డుల ప్ర‌దానం ఉంటుంద‌ని తెలిపింది. ఏ పార్టీ ఎంపీలు‌, ఎమ్మెల్యేలు అయినా స‌రే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని కోరింది. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీ, పార్ల‌మెంట్‌కు వినిపిస్తార‌ని భావిస్తోంది.

 ఏపీ ప్రభుత్వం వినూత్న కార్య‌క్ర‌మం

విజేత‌ల ఎంపిక కోసం ఓ ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు

ఇందులో భాగంగా స‌భ‌లో స‌భ్యుల ప‌నితీరు, వారి ప్ర‌వ‌ర్త‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అవార్డు అంద‌జేయనుంద‌ని తెలుస్తోంది. కాగా, విజేత‌ల ఎంపిక కోసం ఓ ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేసి, ఆ క‌మిటీ ఎంపిక చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల‌కు అవార్డులు అందిస్తార‌ని స‌మాచారం. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో గ‌ళం విప్పితే ‘ఉత్త‌మ లెజిస్లేచ‌ర్‌’, అదే పార్ల‌మెంట్లో అయితే ‘ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్’ త‌ర‌హాలో అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

మరిన్ని ప్రజా సేవలపై దృష్టి

ఈ అవార్డుల కార్యక్రమం మార్చి నెలాఖరులో జరిగే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో భారీగా నిర్వహించే ఈ వేడుకలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని కొనియాడే అవకాశం ఉంది. ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ అవార్డులు తీసుకోవడం ద్వారా నేతలు తమ పనితీరును మెరుగుపరచుకుంటూ మరిన్ని ప్రజా సేవలపై దృష్టి పెడతారు.

Related Posts
వంట నూనెల ధరలకు చెక్: నిర్మలా సీతారామన్
cooking oil

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక Read more

జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana cabinet meeting on January 4

హైదరాబాద్‌ : తెలంగాణ కేబినెట్ సమావేశం జనవరి 4వ తేదీన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కొత్త Read more

ట్రంప్ ఎఫెక్ట్..చెదిరిపోతున్న భారత విద్యార్థుల కల?
donald trump

అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన ప్రకారం, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ పట్టుబడితే Read more

హోలీ పండుగ విశిష్టత ఏంటి
హోలీ పండుగ విశిష్టత ఏంటి

హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాకుండా, అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంది. హోలీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *