AP government innovative program...Awards for MPs and MLAs!

AP Govt : ఏపీ ప్రభుత్వం వినూత్న కార్య‌క్ర‌మం..ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు అవార్డులు!

AP Govt : ప్ర‌జ‌ల‌కు ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను మ‌రింత చేరువ చేసేందుకు ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం మరో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఎవ‌రైతే ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుని వారి కోసం అసెంబ్లీలో, పార్ల‌మెంట్‌లో పోరాటం చేస్తారో వారికి అవార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. పార్టీల‌కు అతీతంగా ఈ అవార్డుల ప్ర‌దానం ఉంటుంద‌ని తెలిపింది. ఏ పార్టీ ఎంపీలు‌, ఎమ్మెల్యేలు అయినా స‌రే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని కోరింది. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అసెంబ్లీ, పార్ల‌మెంట్‌కు వినిపిస్తార‌ని భావిస్తోంది.

Advertisements
 ఏపీ ప్రభుత్వం వినూత్న కార్య‌క్ర‌మం

విజేత‌ల ఎంపిక కోసం ఓ ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు

ఇందులో భాగంగా స‌భ‌లో స‌భ్యుల ప‌నితీరు, వారి ప్ర‌వ‌ర్త‌నను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అవార్డు అంద‌జేయనుంద‌ని తెలుస్తోంది. కాగా, విజేత‌ల ఎంపిక కోసం ఓ ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేసి, ఆ క‌మిటీ ఎంపిక చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల‌కు అవార్డులు అందిస్తార‌ని స‌మాచారం. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో గ‌ళం విప్పితే ‘ఉత్త‌మ లెజిస్లేచ‌ర్‌’, అదే పార్ల‌మెంట్లో అయితే ‘ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్’ త‌ర‌హాలో అవార్డులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

మరిన్ని ప్రజా సేవలపై దృష్టి

ఈ అవార్డుల కార్యక్రమం మార్చి నెలాఖరులో జరిగే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో భారీగా నిర్వహించే ఈ వేడుకలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, ఇతర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని కొనియాడే అవకాశం ఉంది. ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ అవార్డులు తీసుకోవడం ద్వారా నేతలు తమ పనితీరును మెరుగుపరచుకుంటూ మరిన్ని ప్రజా సేవలపై దృష్టి పెడతారు.

Related Posts
కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు
High Court verdict on KTR quash petition today

హైదరాబాద్‌: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు..ముగిశాయి. వాదనలో కేటీఆర్ క్వాష్ ను Read more

సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న మోదీ
సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న మోదీ

కేంద్ర మంత్రి నివాసంలో జరిగే వేడుకలకు తెలుగు మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ బిజెపి నాయకులు, పార్లమెంటు సభ్యులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. Read more

బర్డ్‌ఫ్లూ..చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు
Bird flu.. Authorities orders not to eat chicken and eggs

అమరావతి: పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికారులు.బర్డ్‌ఫ్లూ చికెన్ గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు.ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న బర్డ్ ఫ్లూ కృష్ణా జిల్లాకూ Read more

Komare Reddy : విమానాశ్రయానికి ఉత్తర్వులు జారీ : కోమటిరెడ్డి
Komare Reddy విమానాశ్రయానికి ఉత్తర్వులు జారీ కోమటిరెడ్డి

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతి ఇచ్చేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన Read more

×