AP Deputy CM Pawan Kalyan speech in maharashtra

సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యం: పవన్ కళ్యాణ్

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. దమ్కీలకు ఎట్టి పరిస్థితిలో కూడా భయపడేది లేదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. దేశంలో ప్రతి హిందువు గుండెలో రామనామం లేకుండా ఉండదని అన్నారు.

Advertisements

కాగా, సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు. హిందువులంతా ఏకమైతే.. హైదరాబాద్ నుంచి దేశాన్ని విచ్ఛినం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ ఒవైసీ సోదరులను ఉద్దేశించి ఆయన హాట్ కామెంట్ చేశారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదంటూ.. మజ్లిస్ పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. మరాఠా యోధుల పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి, శివాజీ మహరాజ్ పరిపాలనను, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అర్థం తెలిపిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు.

Related Posts
కీలక నిజాలు బయటపెట్టిన వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి
varra ravindar

గత వైసీపీ హయాంలో సోషల్ మీడియా లో అసత్యప్రచారాలు , అసభ్యకర పోస్టులు , వీడియోలు పోస్టు చేసి నానా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే Read more

ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్
ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్

ప్రస్తుతం ఏం నడుస్తోంది అంటే ప్రేమికులకు గుడ్ టైమ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాలంటైన్స్ వీక్ కొనసాగుతుండగా దానిని మరింత క్రేజీగా మార్చేందుకు విమానయాన సంస్థలు సైతం Read more

కేపీహెచ్‌బీలో ఘోర అగ్నిప్రమాదం
fire accident in kphb colony hyderabad

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ టిఫిన్ సెంటర్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి Read more

కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతుంది: కేటీఆర్‌
ktr comments on congress government

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కరెంటు కోతల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. Read more

×