हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

నేడు ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ !

sumalatha chinthakayala
నేడు ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ !

అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగనుంది. SIPB ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనున్నది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కూడా చర్చించనుంది. కాగా.. ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండ‌లి స‌మావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా కొన్ని కీలకమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది.

image

జనవరి 30న రాష్ట్ర పెట్టుబ‌డుల పోత్సాహాక మండలి భేటీలో 15 ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రూ.44,776 కోట్ల పెట్టుబ‌డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్‌ల‌కు మంత్రివ‌ర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో 2300 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో రూ.10,300 కోట్లతో మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయ‌నున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కూ కేబినెట్‌ గ్రీన్​సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్ట్‌లను ఆమోదించే అవ‌కాశం ఉంది.

ఇక అటు ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పటినుంచి జగన్ 2.0 ని చూస్తారని నిన్న వైఎస్ జగన్ కామెంట్స్‌ చేసిన సంగతి తెలసిందే. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తానని వివరించారు. అయితే.. జగన్ చేసిన కామెంట్స్‌ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించారు.ఎంతో మంది దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లను చంపాడని ఆరోపణలు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870