AP Cabinet meeting today..!

నేడు ఏపీ కేబినెట్ భేటీ..!

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. ఇందులో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగబోతోంది. ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రారంభించాల్సిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి మాట్లాడే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత, సీఎం చంద్రబాబు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి జిందాల్ ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారని సమాచారం.

నేటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశం ద్వారా, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వృద్ధిని పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్లీన్ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. 5 సంస్థలు, రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనుండగా, ఈ ప్రాజెక్టులు 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను అందిస్తాయి.

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్య పట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీని వలన 2,400 మందికి ఉపాధి అవకాశం కలుగనుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగాలు అందించనుంది.

Related Posts
కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి నకిలీ పోలీస్
Command And Control Centre

మరో ఫేక్‌ ఆఫీసర్‌ బాగోతం వెలుగులోకి మొన్న సెక్రటేరియట్ .. నేడు కమండ్ కంట్రోల్ లో భద్రతా వైఫల్యం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) Read more

Mumtaz Hotels : తిరుపతిలో ముంతాజ్ హోటల్స్ కు వ్యతిరేకంగా స్వామిజీల ధర్నా
Swamiji's dharna

తిరుపతిలో హిందూ స్వామిజీలు, ధార్మిక సంఘాలు ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన చేపట్టారు. ఒబెరాయ్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హోటల్ ప్రాజెక్ట్ భక్తుల Read more

కుంభమేళాలో తొక్కిసలాట..
Maha Kumbh Mela Stampede

మహా కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు సంగమం వద్దకు చేరుకున్నారు. అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడికి బారికేడ్లు Read more

ప్రధాన నేతలు జీ20 గ్రూప్ ఫోటోకు దూరంగా :బైడెన్, ట్రుడో, మెలోని గురించి చర్చలు
g20 group photo

బ్రెజిల్‌లో జరిగిన జీ20 సదస్సులో, ప్రపంచ నాయకులు ఒక సంప్రదాయ ఫోటో కోసం నిలబడ్డారు. కానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో Read more