AP Cabinet meeting today..!

నేడు ఏపీ కేబినెట్ భేటీ..!

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. ఇందులో ముఖ్యమైన అంశాలపై చర్చ జరగబోతోంది. ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రారంభించాల్సిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గురించి మాట్లాడే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ తర్వాత, సీఎం చంద్రబాబు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై, వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి జిందాల్ ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారని సమాచారం.

Advertisements

నేటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశం ద్వారా, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల వృద్ధిని పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్లీన్ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. 5 సంస్థలు, రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనుండగా, ఈ ప్రాజెక్టులు 2.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలను అందిస్తాయి.

భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్య పట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేయనుంది. దీని వలన 2,400 మందికి ఉపాధి అవకాశం కలుగనుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగాలు అందించనుంది.

Related Posts
మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ
Prime Minister Modi arrives in Mauritius

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో Read more

ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహం.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
statue of a doctor in Rg Kar hospital. There are different opinions on social media

statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా Read more

మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు
మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు

జర్నలిస్టుపై దాడి కేసులో పోలీసులు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 9) మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. Read more

ఏ2 గేదె పాలను పరిచయం చేసిన సిద్స్ ఫార్మ్
Sid's Farm introduced A2 buffalo milk

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రముఖ డి2సి డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్ , ఇటీవల తమ ఏ2 బఫెలో మిల్క్‌ను కొత్త 1-లీటర్ అసెప్టిక్ ప్యాకేజింగ్ Read more

×