AP Cabinet meeting concluded..Approval of many decisions

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..పలు నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు.

image

గతంలో పెండింగ్ లో ఉన్న నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపునకు ఆమోదం లభించినట్టు సమాచారం. ఇక, మద్యం ధరలపైనా, పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్-2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో, సుమారు రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది. విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్‌లో ఆమోదం లభించింది.

గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి సవరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గాజువాకను ప్రత్యేకంగా తీసుకుని ఈ ప్రాంతంలో వెయ్యి గజాల వరకు కూడా సవరణ చేయలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్టసవరణకు వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి మంత్రిమండలి ఆమోద ముద్ర పడింది. ఇక ఏపీ నాలెడ్జ్ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్‌ 2025కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రెండు సార్లు నగుదును రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు పోలవరం నిర్వాసితులకు రిహబిలిటేషన్ చేసే విధంగా కేబినెట్‌లో చర్చించారు.

Related Posts
ప్ర‌కాశం జిల్లాలో మళ్ళీ భూప్ర‌కంప‌న‌లు
earthquake

ఏపీలోని ప్ర‌కాశం జిల్లాను వ‌రుస భూప్ర‌కంప‌న‌లు వ‌ణికిస్తున్నాయి. జిల్లాలోని ముండ్ల‌మూరులో సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో మ‌రోసారి స్వ‌ల్పంగా భూమి కంపించింది. కాగా, జిల్లాలో ఇలా Read more

రోజా కూతురు ర్యాంప్ వాక్ పిక్ వైరల్
Roja's daughter Anshu Malik

ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కూతురు అన్షు మాలిక తన ప్రతిభతో విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందిన Read more

ఆ తర్వాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman key comments on the economic situation of Telangana

బడ్జెట్‍‌లో తెలంగాణకు అన్యాయం జరగలేదు న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి Read more

విజయసాయిరెడ్డిని విమర్శించిన వైఎస్ షర్మిల
విజయసాయిరెడ్డిని విమర్శించిన వైఎస్ షర్మిల

వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా చర్చకు దారితీసింది. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన Read more