AP budget.. Rs. 20 thousand per year for farmers

ఏపీ బడ్జెట్‌.. రైతులకు ఏడాదికి రూ.20వేలు

రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలు మాఫీ

అమరావతి: ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. వ్యవసాయరంగానికి రూ.48,340 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని చెప్పిన ఆయన ..గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను ఎంపిక చేశామన్నారు. కూటమి ప్రభుత్వం 78 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ, రూ.120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను మాఫీ చేసిందన్నారు.

Advertisements
ఏపీ బడ్జెట్‌  రైతులకు ఏడాదికి

రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్ష

ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం రూ.6.300 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు, సాగు నీటి ప్రాజెక్టులు రూ.11,314 కోట్లు, పోలవరం నిర్మాణం రూ.6,705 కోట్లు, భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్‌ భారత్‌ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు.

పీఎం కిసాన్.. రూ. 6 వేలు

కాగా, ఇప్పటికే రైతన్నలకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతన్నలకు ఏటా రూ. 6వేలు జమ చేస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 6వేలకు ఏపీ ప్రభుత్వం మరో 14వేలు కలిపి ఏడాదికి రూ. 20వేలు పెట్టుబడి సాయంగా అందించనుంది. మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతులకు చెల్లించనున్నారు.

Related Posts
Chiranjeevi: సింగపూర్‌ చేరుకున్న చిరంజీవి దంపతులు
Chiranjeevi: సింగపూర్‌ చేరుకున్న చిరంజీవి దంపతులు

ప్రమాదం కలవరపెట్టిన సంఘటన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలవరపరిచింది. రివర్ వ్యాలీ Read more

తైవాన్ అధికారుల బృందంతో మంత్రి లోకేశ్ భేటీ
Minister Lokesh met with a group of Taiwanese officials

తైపేయి ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఇన్ చెన్నై డైరెక్టర్ జనరల్‌తో మంత్రి చర్చలు అమరావతి: మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో తైపేయి ఎకనామిక్ అండ్ Read more

Modi, trump: ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి మోదీ, ట్రంప్‌లకు పుతిన్ ధన్యవాదాలు
ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి మోదీ, ట్రంప్‌లకు పుతిన్ ధన్యవాదాలు

ఉక్రెయిన్ , రష్యా మధ్య సంఘర్షణను ముగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ప్రపంచ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు Read more

సీఎం ఆఫర్‌ తిరస్కరించా : సోను సూద్‌
Rejected the CM's offer.. Sonu Sood

ముంబయి : బాలీవుడ్‌ స్టార్‌ నటుడు, రియల్‌ హీరో సోను సూద్.. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు Read more

×