Anticipatory bail granted to Perni Nani

పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు

అమరావతి: మాజీమంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. నానికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ కేసులో ఏ6గా ఉన్నారు పేర్ని నాని. మచిలీపట్నం రేషన్‌ బియ్యం మిస్సింగ్‌ వ్యవహారంలో.. మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నంలోని గోదాముల్లో.. రేషన్‌ బియ్యం తగ్గినట్టు అధికారులు గుర్తించారు.

Advertisements
పేర్ని నానికి ముందస్తు బెయిల్

పేర్ని నాని కుటుంబ సభ్యులపై ఆరోపణలు

గోదాము మేనేజర్ మానస్ తేజ బ్యాంక్ ఖాతాలో.. రూ.1.18 కోట్ల నగదు లావాదేవీలను పోలీసులు గుర్తించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారని ఆరోపణలు వచ్చాయి. రేషన్ బియ్యం నిల్వలు, రవాణాలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు పేర్ని నాని కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

నాని పై తొందరపాటు చర్యలొద్దు

పేర్ని నాని ఆదేశాల మేరకే రేషన్ బియ్యం మాయం, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి.. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా చేర్చారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండటానికి పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. నాని పై తొందరపాటు చర్యలొద్దని, కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది.

Related Posts
ట్రంప్ 2024: 27 ఏళ్ల కరోలిన్ లీవిట్ ను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు
Karoline Leavitt

డొనాల్డ్ ట్రంప్ తన 2024 ఎన్నికల అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన ప్రభుత్వంలో కీలకమైన పదవులలో కొత్త నియామకాలు చేస్తున్నారు. తాజాగా, ట్రంప్ 27 ఏళ్ల  కరోలిన్ లీవిట్ Read more

మీ టికెట్ యాప్: బుకింగ్‌ సులభతరం
మీ టికెట్ యాప్: బుకింగ్‌ సులభతరం

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీ టికెట్ యాప్ పౌరులు, పర్యాటకులకు టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి రూపొందించబడింది. మెట్రో, బస్సు ప్రయాణాలు, ఆలయ దర్శనాలు, పార్కుల Read more

కుప్పకూలిన మంచు కొండ.. 47 కార్మికులు గల్లంతు
uttara Collapsed ice mounta

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ-బద్రీనాథ్ జాతీయ రహదారి వద్ద ఉన్న మంచు కొండ ఒక్కసారిగా కుప్పకూలడంతో రోడ్డు నిర్మాణ పనిలో ఉన్న కార్మికులు Read more

నేడు వేములవాడకు సీఎం రేవంత్‌ రెడ్డి..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
CM Revanth Reddy will go to Maharashtra today

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వేములవాడ పర్యటనకు వెళ్లనున్నారు. మొదట వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం.. అనంతరం స్థానికంగా రూ.127 కోట్ల అభివృద్ధి Read more

Advertisements
×