Another rare honor for Chiranjeevi

చిరంజీవికి మరో అరుదైన గౌరవం

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే పార్లమెంట్‌ గుర్తించింది. దీంతో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించాలని యూకే పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ వార్త వెలువడిన వెంటనే ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మార్చి 19న ఈ అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకుంటారు.

చిరంజీవికి మరో అరుదైన గౌరవం

పునాదిరాళ్ళు తో ఇండస్ట్రీలోకి

సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా చిరును అభినందిస్తున్నారు. మార్చి 19న చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఇక, పునాదిరాళ్ళు తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్‌ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్‌ రికార్డులు క్రియేట్‌ చేశారు. 9 ఫిలింఫేర్‌, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.

2024లో పద్మవిభూషణ్‌

సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్‌, 2024లో పద్మవిభూషణ్‌ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన విశ్వంభర కోసం వర్క్‌ చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. దసరా ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు.

Related Posts
హైదరాబాద్ లో సస్టైనబల్ ఉన్నత విద్య కోసం యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, సిమెన్స్, మరియు టి -హబ్ భాగస్వామ్యం
University of East London Siemens and T Hub partnership for sustainable higher education in Hyderabad

హైదరాబాద్ : యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్), సిమెన్స్ యుకె మరియు టి -హబ్ హైదరాబాద్‌ సంయుక్తంగా 13 నవంబర్ 2024న సస్టైనబిలిటీ ని ముందుకు Read more

15 నెలల కాంగ్రెస్ పాలన చూసి ప్రజలకు విసుగు – కేటీఆర్
He won by showing heaven in the palm of his hand.. KTR

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, 15 నెలల పాలనతోనే విసుగు చెంది పోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి Read more

ఒరిజినల్ బాంబులకే భయపడలే.. కాంగ్రెస్ నేతల ప్రకటనకు బెదరుతామా – కేటీఆర్
KTR 19

మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో రాజకీయ వేడి పెంచుతూ కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "తాము ఒరిజినల్ బాంబులకు భయపడలేదంటే, కేవలం కాంగ్రెస్ నేతల ప్రకటనలకు Read more

10వ రోజు జూనియర్ డాక్టర్ల నిరవధిక నిరాహార దీక్ష
RG Kar issue. Junior doctors hunger strike enters 10th day

కోల్‌కతా : కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు గత 10 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు. దీంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *