Another petition of Ram Gopal Varma in AP High Court

ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్‌ వర్మ మరో పిటిషన్ !

అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ వేశారు. తాను ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. చట్టవిరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులు పెడుతున్నారని ఆర్జీవీ పిటిషన్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని రామ్‌గోపాల్‌ వర్మ తెలిపారు.

ఇకపై ఈ పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని రామ్‌గోపాల్‌ వర్మ పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని ఆర్జీవీ పిటిషన్ వేయడం జరిగింది. ఇక నేడు రామ్‌గోపాల్‌ వర్మ వేసిన పిటిషన్‌పై విచారించనున్న ఏపీ హైకోర్టు… ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. అటు జైల్లో వేసినా కూడా తాను భయపడను అంటూ వర్మ కామెంట్స్ చేశారు.

కాగా, రామ్‌గోపాల్‌వర్మ(ఆర్జీవీ) అజ్ఞాతంలో ఉండి వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు ఎలాంటి భయం లేదని చెబుతూ.. తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏమాత్రం అర్హత లేదని ఆయన అందులో స్పష్టం చేశారు. పోలీసు విచారణకు సహకరిస్తానని చెప్పి.. తప్పించుకుని తిరుగుతున్న ఆయన వీడియోలో వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసులో రెండుసార్లు ఆయన విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే.

Related Posts
రేవంత్ నిర్ణయం ఏపీపైనా ప్రభావం
revanth, babu

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమాల Read more

దసరాకు ఈ ప్రతిజ్ఞ చేయండి – మంత్రి పొన్నం
unnamed file

ట్రాఫిక్ రూల్స్ పాటించండి, క్షేమంగా ప్రయాణించండి, ప్రాణాల్ని రక్షించండని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సగటున దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా Read more

మణిపూర్ సీఎంని తొలగించండి : ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యేలు లేఖ
Remove Manipur CM. BJP MLAs letter to Prime Minister

ఇంఫాల్ : మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ Read more

బీజేపీకి నకిలీ ఓట్ల లక్ష్యాలు ఉన్నాయి: కేజ్రీవాల్
బీజేపీకి నకిలీ ఓట్ల లక్ష్యాలు ఉన్నాయి: కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, బీజేపీ 7 మంది ఎంపీలను నకిలీ ఓట్లు వేయమని అడిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. Read more