రేవంత్ కేబినెట్ లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ వర్గాలకు ఇవ్వాలనే

తెలంగాణలో బీసీ వర్గాలకు మరో డిప్యూటీ సీఎం?

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. దీంతో, తాజా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. గీత దాటవద్దని ఏ సమస్య ఉన్నా తమ వద్దకు రావాలని సూచించారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవులు పీసీసీ కార్యవర్గం పై చర్చించనున్నారు.

telangana cm revanth reddy launches two schemes as part of six poll guarantees of cong

రేవంత్ మంత్రాంగం తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో, ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశం కావాలని రేవంత్ నిర్ణయించారుఢిల్లీ వెళ్లిన రేవంత్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. బీసీ డిప్యూటీ సీఎం ఇదే సమయంలో బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త నిర్ణయాల దిశగా కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవి బీసీ వర్గానికి ఇవ్వగా, తాజాగా డిప్యూటీ సీఎం పదవి సైతం బీసీ వర్గాలకు ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో భట్టి మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండేలా హైకమాండ్ నిర్ణయించింది. బీజేపీ సైతం బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చింది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు సైతం బీసీకే ఇస్తారని సమాచారం దీంతో, బీసీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎంగా డిప్యూటీతో పాటుగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఈ క్రమంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి పైన తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే ముదిరాజ్ వర్గానికి కేటాయిస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు ఇక ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా ఆసక్తి కర నిర్ణయాలకు అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

Related Posts
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుండి 26వ తేదీ వరకు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు Read more

రాష్ట్రంలో పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు – మంత్రి కోమటిరెడ్డి
telangana minister komatire

తెలంగాణ రాష్ట్రంలో జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశముందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ పునర్విభజనతో రాష్ట్రానికి కొత్తగా 34 అసెంబ్లీ Read more

20 లక్షల ఇళ్ళు మంజూరు చేయాలని కోరిన రేవంత్ రెడ్డి
20 లక్షల ఇళ్ళు మంజూరు చేయాలని కోరిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, వాటితో సంబంధించి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే. చందర్ Read more

‘మయోనైజ్’ బిర్యానీ తిని ఒకరు మృతి..ఎక్కడంటే
Mayonnaise biryani

తెలంగాణలో మయోనైజ్ వినియోగంపై పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాదులో కలుషితమైన మయోనైజ్ వల్ల అనారోగ్యానికి గురైన 50 మందిలో ఒకరు ప్రాణాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *