Another case registered against Vallabhaneni Vamsi

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు

అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత ఐదేళ్లూ మిన్నకుండిపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కేసు పెట్టారు. గన్నవరం శివారు మర్లపాలెంలో సుమారు 18 ఎకరాల్లో పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్థులు గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు.

Advertisements
వల్లభనేని వంశీపై మరో కేసు

అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం

2023లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయాలని రైతులపై ఒత్తిడి చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రజల ఉపయోగం కోసం చెరువును అభివృద్ధి చేస్తామంటూ ఆ భూమిని స్వాధీనం చేసుకొని.. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. చెరువు భూమికి ప్రత్యామ్నాయంగా రైతులకు వేరే చోట భూమి ఇస్తామని తొలుత చెప్పి.. తర్వాత దగా చేశారు. దీనిపై మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ణ మంగళవారం రాత్రి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏ1గా వల్లభనేని వంశీని, ఏ2గా అనగాని రవి, ఏ3గా రంగా, ఏ4గా శేషు, ఏ5గా మేచినేని బాబు పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు.

Related Posts
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం..
world computer literacy day

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ప్రతి సంవత్సరమూ డిసెంబరు 2న జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడం, డిజిటల్ నైపుణ్యాలు మరియు కంప్యూటర్ నైపుణ్యం Read more

Akhilesh Yadav : ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్
Akhilesh Yadav ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి అఖిలేశ్ యాదవ్

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మరోసారి మోదీపై నిప్పులు చెరిగారు.లక్నోలో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మోదీకి ఝలక్ ఇచ్చారు.ముఖ్యంగా సుంకాల విధానం విషయంలో Read more

బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?
బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?

గత కేంద్ర బడ్జెట్‌లో పాత పన్ను విధానంలో మార్పులు చేయకుండా, కొత్త పన్ను విధానంలో కొన్ని ఆకర్షణీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను మినహాయింపులు పొందడానికి జీతాలు Read more

PM Modi : ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
Sri Lanka highest award for Prime Minister Modi

PM Modi : భారతదేశం, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ఉమ్మడి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శ్రీలంక Read more

×