Another case against former minister Harish Rao

మాజీ మంత్రి హరీశ్ రావుపై మరో కేసు

కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసులు బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా మరో ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని బాచుపల్లి పోలీసులను చక్రధర్‌ గౌడ్‌ ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సంతోష్‌ కుమార్‌, హరీష్ రావు, రాములు, వంశీలపై కేసు నమోదైంది.

Advertisements
మాజీ మంత్రి హరీశ్ రావుపై

ఏ2గా హరీష్ రావు

బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం హరీష్ రావు పై 351 (2) R/W 3, (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ -1 వంశీ కృష్ణ, ఏ3 సంతోష్ కుమార్, ఏ4గా పరుశురాములు పేర్లను చేర్చిన పోలీసులు ఏ2గా హరీష్ రావు పేరు చేర్చారు. గతంలో హరీష్ రావుపై ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేశారు చక్రధర్ గౌడ్. తన ఫోన్ ట్యాప్ చేసి తన భార్యతో, బంధువులతో జరిపిన ఫోన్ సంభాషణలను విన్నారని.. కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు న్యాయస్థానాన్ని సైతం చక్రధర్ గౌడ్ ఆశ్రయించడం తెలిపిందే. తాజాగా హరీష్ రావు సహా కొందరి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.

జూన్‌ 19న చక్రధర్‌గౌడ్‌ డీజీపీకి ఫిర్యాదు

కాగా, మాజీ మంత్రి హరీష్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్‌ నేత చక్రధర్‌గౌడ్‌ ఆరోపించారు. తన ఫోన్‌ ట్యాప్‌ అయిందంటూ గత ఏడాది జూన్‌ 19న చక్రధర్‌గౌడ్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు చక్రధర్‌గౌడ్‌ను గతంలో విచారించిన పోలీసులు సరైన ఆధారాలు తీసుకు రావాలని సూచించారు.

Related Posts
ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదు : గవర్నర్
There will be no increase in electricity charges in AP.. Governor

20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్ అమరావతి: 2025-26లో విద్యుత్‌ ఛార్జీల పెరుగుదల ఉండదని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ప్రకటించారు. ఈరోజు Read more

పాకిస్థాన్ బాంబు పేలుడు.. 10 మంది దుర్మరణం
Pakistan bomb blast.. 10 dead

పేలుడుకు గల కారణాలేమిటో స్పష్టంగా తెలియరాలేదన అధికారులు ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా బాంబు Read more

Andhrapradesh: ప‌దో త‌ర‌గ‌తిలో స‌త్తాచాటిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం
Andhrapradesh: ప‌దో త‌ర‌గ‌తిలో స‌త్తాచాటిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం

అనంతపురం జిల్లా ఇటీవ‌ల విడుద‌లైన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో స‌త్తాచాటిన ప్ర‌తిభావంతుల‌కు ఎంఈఓ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో భాగంగా, బెళుగుప్ప మండల Read more

SRH : సన్ రైజర్స్ కు మరో ఓటమి
srh lost match

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరోసారి పరాజయం ఎదురైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో సన్ రైజర్స్ Read more

Advertisements
×