chandra babu

ఏపీలో మరో 20 వేల ఉద్యోగాలు-చంద్రబాబు!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైన హామీల్లో ఉద్యోగాల కల్పన కూడా ఒకటి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కూటమి పార్టీలు.. ఇప్పుడు వాటిపై దృష్టిసారించాయి. ఇందులో భాగగా ఇవాళ జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో యువతకు 20 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మూడవ రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 15 ప్రాజెక్టులకు సంబంధించి కీలక పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ అక్షరాలా రూ.44,776 కోట్లు. ఈ మేర పెట్టుబడుల్ని ఆమోదిస్తూ ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పన జరగబోతోంది. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్ర స్ధాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి సిఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తి కరంగా ఉందని అభిప్రాయ పడ్డారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని వారికి తెలిపారు.

Related Posts
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..నేడు కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న పవన్ కల్యాణ్
WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: రెండో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 9 గంటలకు Read more

ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై పిడి యాక్ట్ : మంత్రి కొల్లు రవీంద్ర
kollu

మంత్రి కొల్లు రవీంద్ర ఇసుక విధానంలో జరుగుతున్న మార్పులు, గత ప్రభుత్వ కాలంలో జరిగిన తప్పిదాలు, మరియు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల గురించి వివరణ ఇచ్చారు. గత Read more

ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు
new airport ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి, రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మార్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో డొమెస్టిక్ టెర్మినల్ ఏర్పాటు Read more

బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక

చిత్తూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిడ్డకు జన్మనిచ్చి మరణించిన మైనర్‌ బాలిక.పలమనేరు మండలం టి ఒడ్డురు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *