हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట: రెండు కేసుల ఉపసంహరణ, మరొకటిపై సీఎం చంద్రబాబు నిర్ణయం మిగిలి ఉంది

Divya Vani M
ఏబీ వెంకటేశ్వరరావుకు  భారీ ఊరట: రెండు కేసుల ఉపసంహరణ, మరొకటిపై సీఎం చంద్రబాబు నిర్ణయం మిగిలి ఉంది

గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు ఇప్పుడు గణనీయమైన ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ప్రధాన కేసుల్లో, ఏపీ సర్కార్ రెండు కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది, అయితే మిగిలిన ఒక కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్పు ఇంకా రావాల్సి ఉంది.

గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీవీ, వైసీపీ సర్కార్ వచ్చాక తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొన్నారు. నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని జగన్మోహన రెడ్డి సర్కార్ ఆరోపణలు చేస్తూ, ఆయనపై సస్పెన్షన్ విధించింది. ఇంకా, ఆయనను సర్వీసు నుండి తొలగించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 2019 నుండి ఏబీవీ అనేక సస్పెన్షన్లు, క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఐదేళ్లపాటు సాగిన ఈ న్యాయపోరాటం తర్వాత, పదవీ విరమణకు ఒక రోజు ముందు ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ వచ్చింది. మే 31న, ఆయన గౌరవ ప్రదంగా పదవీ విరమణ చేశారు.

అయితే, వైసీపీ సర్కార్, అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని, పెగాసస్ వ్యవహారంలో మరియు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏబీవీ మీడియాతో మాట్లాడారని ఆరోపించింది. ఈ కేసుల పరిధిలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

నిబంధనల ప్రకారం, ఆ ఆరోపణలపై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉండగా, ఏడాదిన్నర తర్వాత కూడా ప్రభుత్వం విచారణ పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో, ఆ కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఏబీ వెంకటేశ్వరరావు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్లు కనబడుతున్నాయి. కానీ, ఇంకా ఒక కేసుపై సీఎం చంద్రబాబు తీర్పు రావాల్సి ఉండటంతో, అది ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870