ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) తన మన్ కీ బాత్ కార్యక్రమంలో “యోగాంధ్ర-2025” ప్రాజెక్టును ప్రస్తావించడంతో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యతను గుర్తించి తీసుకుంటున్న చర్యలను వివరించారు. “మన్ కీ బాత్”(Mann Ki Baat)లో మోదీ గారు యోగాంధ్ర గురించి ప్రస్తావించటం మా కోసం గర్వకారణం. ఆయన మాటలు మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి” అని చంద్రబాబు అన్నారు.
జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా మాసాన్ని పురస్కరించుకుని జూన్ 21 వరకు 100 ముఖ్య పర్యాటక ప్రదేశాల్లో యోగా సెషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడానికి, యోగా ని జీవితంలో భాగంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సెషన్ల ద్వారా యువతలో మరియు సీనియర్ పౌరుల్లో యోగా పట్ల ఆసక్తి పెంపొందించాలనేది ప్రభుత్వం ఉద్దేశం.
మోదీకి ఘన స్వాగతానికి సిద్ధం అవుతున్న విశాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొననున్న యోగా కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. “మీ రాకకై ఎదురుచూస్తున్నాం మోదీ గారు” అంటూ చంద్రబాబు తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. విశాఖ యోగా వేడుకలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించేలా జరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also : Kakani Govardhan Reddy : కాకాణి గోవర్దన్రెడ్డి అరెస్ట్