విజయవాడకు(Vijayawada) చెందిన సాయి గోపి ఐటీ రంగంలో(IT sector) పనిచేస్తూ ప్రతినెలా సుమారు ₹50,000 జీతం అందుకుంటున్నప్పటికీ, తీవ్ర ఒత్తిడి, వ్యక్తిగత సమయం లేకపోవడం వల్ల ఉద్యోగాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేయడం చిన్న విషయం కాకపోయినా, జీవితంలో మార్పు కోసం ధైర్యంగా ముందడుగు వేశారు.
Read Also: TG: తెలంగాణలో అలజడి సృష్టిస్తున్న APK ఫైల్స్

కుటుంబ కుల వృత్తినే కొత్త అవకాశంగా మార్చిన గోపి
కుటుంబ సంప్రదాయమైన కుండల తయారీ పనిని చిన్నతనం నుంచి చూసిన సాయి గోపి,(Vijayawada) దానిలోనే అవకాశాలను గుర్తించారు. ఆధునిక డిజైన్లు, మంచి ఫినిషింగ్, మార్కెట్ అవసరాలు అర్థం చేసుకుని కుండల తయారీకి కొత్త రూపం ఇచ్చారు. మట్టి పనిని క్రియేటివిటీతో మిళితం చేసి తన ఉత్పత్తులను మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టారు.
నెలకు లక్ష మందీ… రెండు లక్షల వరకూ ఆదాయం
ఇప్పటికే అతని కుండలకు మంచి డిమాండ్ ఏర్పడింది. స్థానిక మార్కెట్తో పాటు ఆన్లైన్ ద్వారా కూడా విక్రయాలు పెరుగుతున్నాయి. నెలకు ₹1 లక్ష నుండి ₹2 లక్షల వరకు ఆదాయం వస్తోందని గోపి తెలిపారు. ఐటీ ఉద్యోగం కంటే ఇప్పుడు ఆర్థికంగా, మానసికంగా ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. మట్టి పనిలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడిందని సాయి గోపి చెబుతున్నారు. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలు ఇప్పుడు లేవని అంటున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: