News Telugu: TTD: వైకుంఠ ద్వారం దర్శనం తేదీలు ప్రకటించిన టీటీడీ!

Read Time:  1 min
TTD announces dates for Vaikuntha Dwaram darshan
TTD announces dates for Vaikuntha Dwaram darshan
FONT SIZE
GET APP

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) ఆనందకరమైన సమాచారం అందించింది. ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాల కోసం డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ వ్యవధిలో భక్తులు స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం పొందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఎక్కువగా ఏర్పాట్లు సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు.

Train Accident: ఏపీలో రైలు ప్రమాదం ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

TTD announces dates for Vaikuntha Dwaram darshan

TTD announces dates for Vaikuntha Dwaram darshan

164 గంటలను

మొత్తం 182 గంటల వైకుంఠ ద్వార దర్శనాల్లో 164 గంటలను పూర్తిగా సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామని ఆయన వివరించారు. దీంతో ఈసారి ఎక్కువ మంది భక్తులకు లాభం చేకూరే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీటీడీ అధికారులు భద్రత, క్యూ లైన్‌లు, సదుపాయాల గురించి వివరించారు. భారీ భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి అన్ని విభాగాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.